యాప్నగరం

‘సైఫుల్లా తండ్రిని చూసి దేశం గర్విస్తోంది’

తీవ్రవాదులతో చేతులు కలిపి దేశాన్ని నాశనం చేయాలనుకున్న టెర్రరిస్టు సైఫుల్లా శవాన్ని తీసుకునేందుకు నిరాకరించిన

TNN 9 Mar 2017, 1:50 pm
తీవ్రవాదులతో చేతులు కలిపి దేశాన్ని నాశనం చేయాలనుకున్న టెర్రరిస్టు సైఫుల్లా శవాన్ని తీసుకునేందుకు నిరాకరించిన అతని తండ్రి సర్తాజ్ పట్ల దేశం గర్విస్తోందని హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ అన్నారు. బుధవారం లక్నోలోని థాకూర్ గంజ్ లోని ఓ ఇంట్లో ఉగ్రచర్యలకు పాల్పడుతున్న సైఫుల్లాను ఏటీఎస్ కమెండోలు మట్టుబెట్టాయి.
Samayam Telugu rajnath singh says in parliament proud of saifullahs father
‘సైఫుల్లా తండ్రిని చూసి దేశం గర్విస్తోంది’


సైఫుల్లా శవాన్ని తీసుకెళ్లేందుకు అతని తండ్రి సర్తాజ్ నిరాకరించారు. ‘‘దేశద్రోహి నా కొడుకు కాదు. మేం భారతీయులం. మా తాత ముత్తాతల నుంచి మా వరకు ఇక్కడే పుట్టాం. దేశానికి హాని తలపెట్టే వారితో మాకు ఏలాంటి సంబంధాలు లేవు’’ అని సర్తాజ్ స్పష్టం చేశారు.

లక్నో ఎన్ కౌంటర్ పై గురువారం రాజ్ నాథ్ లోక్ సభ దృష్టికి తీసుకొచ్చారు. ఈ ఎన్ కౌంటర్, ఐసిస్ పాత్రపై ఎన్ఐఏ విచారణ జరుపుతుందని ఆయన వివరణ ఇచ్చారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘‘సర్తాజ్ ఐసిస్ టెర్రరిస్టు డెడ్ బాడీని తీసుకెళ్లేందుకు నిరాకరించారు. ఆయన చర్యపట్ల జాతియావత్ గర్విస్తోంది’’ అని అన్నారు.
మంగళవారం భోపాల్-ఉజ్జయిని ట్రైన్ ను పేల్చేందుకు సైఫుల్లా కుట్ర పన్నినట్లు ఏటీఎస్ ఆధారాలు సంపాదించింది. పైపులైన్ ద్వారా ఓ భోగిని పేల్చేందుకు ఉగ్రవాదులు విఫలయత్నం చేశారు. దీంతో ఆ భోగిలో తొమ్మిది మంది తీవ్రంగా గాయపడ్డారు.

అదేరోజు యూపీ, మధ్యప్రదేశ్ లలో తొమ్మిది మంది అనుమానిత ఉగ్రవాదులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరంతా దేశంలోని వివిధ ప్రాంతాల్లో భారీ విధ్వంసానికి కుట్ర పన్నినట్లు నిఘా వర్గాలు గుర్తించాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.