రాజ్యసభ డిప్యూటి ఛైర్మన్ పదవికి నేడు ఎన్నిక జరగనుంది. ఎన్డీఏ తరపున జెడియు ఎంపి హరివంశ్ నారాయణ్ సింగ్, విపక్షాల తరపున కాంగ్రెస్ అభ్యర్థి బికె హరిప్రసాద్ పోటీ పడుతున్నారు. తమ తమ అభ్యర్థుల గెలుపుపై ఇరుపక్షాలు ధీమాతో ఉన్నాయి. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ముగియడానికి ఒకరోజు ముందు ఈ ఎన్నిక జరుగుతోంది.
హరివంశ్ సింగ్ తొలిసారి రాజ్యసభ ఎంపీ కాగా, హరిప్రసాద్ కాంగ్రెస్ తరఫున మూడుసార్లు పార్లమెంటుకు ఎన్నికయ్యారు. ప్రస్తుతం రాజ్యసభ ఎంపీల సంఖ్య 244. ఇందులో డిప్యూటి ఛైర్మన్గా గెలిచేందుకు 123 మంది సభ్యుల మద్దతు అవసరం. ఇప్పటివరకున్న అంచనాల ప్రకారం అధికార పార్టీ తమకు 126 మంది ఎంపీల బలముందని చెబుతోంది. విపక్ష కూటమి తమ వద్ద అవసరమైన ఎంపీల బలముందని పేర్కొంది. అయితే ఎన్డీఏ అభ్యర్థి హరివంశ్ సింగ్ గెలుపుపై బీజేపీ ధీమాగా ఉంది.
సభలో మెజారిటీ లేకపోవడం వల్ల బీజేపీ అభ్యర్థిని గెలిపించుకోవడం అంత సులువైన విషయం ఏమీ కాదు. ఎన్డీఏ ఎంపీలు శివసేనతో కలిపి 93 మంది ఉన్నారు. శివసేన బీజేపీ అభ్యర్థికే మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించింది. అయితే జేడీయూ పార్టీ నుంచి అభ్యర్థిని ఎంపిక చేయడం పట్ల శిరోమణి అకాళీ దల్ అసంతృప్తిగా ఉంది. బీజేపీ లెక్కల ప్రకారం హరివంశ్కు 91 మంది ఎన్డీఏ ఎంపీల సంపూర్ణ మద్దతుంది. వీరితో పాటు ముగ్గురు నామినేటెడ్ ఎంపీలు, ఎస్పీ ఎంపీ అమర్ సింగ్లు తోడున్నారు. ఎన్డీయేయేతర పక్షాలైన అన్నాడీఎంకే ఎంపీలు 13 మంది, టీఆర్ఎస్ నుంచి ఆరుగురు, ఏకైక ఐఎన్ఎల్డీ అభ్యర్థి మద్దతు తమకుందని బీజేపీ చెబుతోంది. ఇవన్నీ కలుపుకుంటే హరివంశ్ ఖాతాలోకి 115 ఓట్లు వస్తాయి.
అయితే బీజేడీకి ఉన్న 9 మంది ఎంపీలు మద్దతు అధికార పక్షానికి కీలకం కానుంది. వీరి మద్దతు దక్కితే 124 ఎంపీల బలంతో ఎన్డీయే కూటమి అభ్యర్థి గెలిచినట్లే. అటు విపక్షం కూడా తమ లెక్కలను స్పష్టం చేసింది. హోరాహోరీగా సాగనున్న రాజ్యసభ డీప్యూటి ఛైర్మన్ ఎన్నికలో ఎవరు గెలుస్తారో వేచిచూడాలి.
హరివంశ్ సింగ్ తొలిసారి రాజ్యసభ ఎంపీ కాగా, హరిప్రసాద్ కాంగ్రెస్ తరఫున మూడుసార్లు పార్లమెంటుకు ఎన్నికయ్యారు. ప్రస్తుతం రాజ్యసభ ఎంపీల సంఖ్య 244. ఇందులో డిప్యూటి ఛైర్మన్గా గెలిచేందుకు 123 మంది సభ్యుల మద్దతు అవసరం. ఇప్పటివరకున్న అంచనాల ప్రకారం అధికార పార్టీ తమకు 126 మంది ఎంపీల బలముందని చెబుతోంది. విపక్ష కూటమి తమ వద్ద అవసరమైన ఎంపీల బలముందని పేర్కొంది. అయితే ఎన్డీఏ అభ్యర్థి హరివంశ్ సింగ్ గెలుపుపై బీజేపీ ధీమాగా ఉంది.
సభలో మెజారిటీ లేకపోవడం వల్ల బీజేపీ అభ్యర్థిని గెలిపించుకోవడం అంత సులువైన విషయం ఏమీ కాదు. ఎన్డీఏ ఎంపీలు శివసేనతో కలిపి 93 మంది ఉన్నారు. శివసేన బీజేపీ అభ్యర్థికే మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించింది. అయితే జేడీయూ పార్టీ నుంచి అభ్యర్థిని ఎంపిక చేయడం పట్ల శిరోమణి అకాళీ దల్ అసంతృప్తిగా ఉంది. బీజేపీ లెక్కల ప్రకారం హరివంశ్కు 91 మంది ఎన్డీఏ ఎంపీల సంపూర్ణ మద్దతుంది. వీరితో పాటు ముగ్గురు నామినేటెడ్ ఎంపీలు, ఎస్పీ ఎంపీ అమర్ సింగ్లు తోడున్నారు. ఎన్డీయేయేతర పక్షాలైన అన్నాడీఎంకే ఎంపీలు 13 మంది, టీఆర్ఎస్ నుంచి ఆరుగురు, ఏకైక ఐఎన్ఎల్డీ అభ్యర్థి మద్దతు తమకుందని బీజేపీ చెబుతోంది. ఇవన్నీ కలుపుకుంటే హరివంశ్ ఖాతాలోకి 115 ఓట్లు వస్తాయి.
అయితే బీజేడీకి ఉన్న 9 మంది ఎంపీలు మద్దతు అధికార పక్షానికి కీలకం కానుంది. వీరి మద్దతు దక్కితే 124 ఎంపీల బలంతో ఎన్డీయే కూటమి అభ్యర్థి గెలిచినట్లే. అటు విపక్షం కూడా తమ లెక్కలను స్పష్టం చేసింది. హోరాహోరీగా సాగనున్న రాజ్యసభ డీప్యూటి ఛైర్మన్ ఎన్నికలో ఎవరు గెలుస్తారో వేచిచూడాలి.