యాప్నగరం

జూన్ 19న రాజ్యసభ ఎన్నికలు

Delhi: రాజ్యసభ ఎన్నికల నగారా మోగింది. కొవిడ్-19 కారణంగా వాయిదాపడ్డ రాజ్యసభ ఎన్నికలను జూన్ 19న నిర్వహించడానికి ఎన్నికల సంఘం ముహూర్తం ఖరారు చేసింది.

Samayam Telugu 1 Jun 2020, 6:11 pm
రాజ్యసభ ఎన్నికల తేదీలను కేంద్ర ఎన్నికల సంఘం ఖరారు చేసింది. జూన్ 19న ఎన్నికలు నిర్వహించనుంది. 18 రాజ్యసభ స్థానాలకు ఆ రోజు ఎన్నికలు జరుగనున్నాయి. ఖాళీ అయిన ఈ స్థానాలకు గతంలోనే ఎన్నికల తేదీలు ఖరారు చేసినప్పటికీ.. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్నారు. తాజాగా కేంద్ర ఎన్నికల సంఘం వీటికి మరోసారి తేదీ ఖరారు చేస్తూ సోమవారం (జూన్ 1) నిర్ణయం తీసుకుంది. జూన్ 19న ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరుగనుంది. పోలింగ్ ముగిసిన వెంటనే ఓట్ల లెక్కింపు చేపట్టడానికి ఏర్పాట్లు చేసినట్లు ఎన్నికల సంఘం తెలిపింది.
Samayam Telugu రాజ్యసభ ఎన్నికలు
Rajya Sabha


55 స్థానాల్లో 37 ఇప్పటికే ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 18 స్థానాలకు జూన్ 19న ఎన్నికలు నిర్వహించనున్నారు. వీటిలో ఆంధ్రప్రదేశ్‌లో 4, గుజరాత్‌లో 4, రాజస్థాన్‌లో 3, మధ్యప్రదేశ్‌లో 3, జార్ఖండ్‌లో 2, మణిపూర్‌లో 1, మేఘాలయలో ఒక స్థానం ఉన్నాయి.

Also Read: ScoMosa: మోదీకి ఆస్ట్రేలియా ప్రధాని ‘హాట్’ గిఫ్ట్

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.