యాప్నగరం

రాజ్యసభ ఎన్నికలు వాయిదా... కేేంద్ర ఎన్నికల సంఘం కీలక ప్రకటన

కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం. దేశ వ్యాప్తంగా లాక్ డౌన్. రాజ్యసభ ఎన్నికలు వాయిదా. మార్చి 26న జరగాల్సిన పోలింగ్ రద్దు.

Samayam Telugu 24 Mar 2020, 12:05 pm
రాజ్యసభ ఎన్నిలక విషయంలో కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా లాక్ డౌన్ నడుస్తున్న నేపథ్యంలో రాజ్యసభ ఎన్నికల్ని వాయిదా వేస్తున్నట్లు భారత ఎన్నికల సంఘం ప్రకటించింది. గతంలో ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం మార్చి 26న రాజ్యసభ ఎన్నికల పోలింగ్ జరగాల్సి ఉంది. దేశవ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తికి నడుం బిగించిన నేపథ్యంలో ఎన్నికల నిర్వహణ సరికాదని భావించిన ఈసీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది.
Samayam Telugu rajya sabha


అయితే.. రాజ్యసభ ఎన్నికలను వాయిదా వేసినట్లు ప్రకటించిన ఎన్నికల సంఘం తదుపరి షెడ్యూల్‌పై మాత్రం ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. దేశ వ్యాప్తంగా 55 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు గతంలో ఈసీ ప్రకటించింది. ఏప్రిల్లో రాజ్యసలో ఖాళీకానున్న 55 ఎంపీ స్థానాలకు సంబంధించిన షెడ్యూల్ విడుదల చేశారు. షెడ్యూల్ ప్రకారం రాజ్యసభ ఎన్నికలు మార్చి 26వ తేదీన నిర్వహించాలనకున్నారు. కానీ కరోనా వైరస్ వల్ల ఇప్పుడు దేశమంతా లాక్ డౌన్ చేసిన పరిస్థితి. మరి ఇలాంటి సమయంలో ఎన్నికలు నిర్వహణ సరికాదని కేంద్ర ఎన్నికల సంఘం భావించింది. దీంతో రాజ్యసభ ఎన్నికల్ని వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది.

ఇదిలా ఉంటే.. సోమవారంతో పోల్చుకుంటే మంగళవారం లాక్‌డౌన్ ప్రభావం దేశవ్యాప్తంగా కనిపించింది. తొలిరోజు రోడ్లపై గుంపులుగా కనిపించిన ప్రజలు.. లాక్‌డౌన్‌ను ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటారన్న విషయం తెలియడంతో రోడ్లపైకి వచ్చే సాహసం చేయలేదు. ఇవాళ లాక్ డౌన్ సమర్థవంతంగా నడుస్తోంది. ఇదే విధంగా ప్రజలు మరో పది రోజుల పాటు లాక్ డౌన్ పాటిస్తే.. కరోనాను సమర్థవంతంగా ఎదుర్కోవచ్చంటున్నారు అధికారులు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.