యాప్నగరం

లంచం ఇచ్చేవారికీ ఇకపై జైలుశిక్ష..!

లంచం తీసుకున్నవారికే కాదు.. ఇచ్చేవారికి కూడా ఇకపై కఠిన శిక్షలు పడనున్నాయి. ఈ మేరకు రాజ్యసభలో గురువారం ప్రవేశపెట్టిన

Samayam Telugu 20 Jul 2018, 7:42 am
లంచం తీసుకున్నవారికే కాదు.. ఇచ్చేవారికి కూడా ఇకపై కఠిన శిక్షలు పడనున్నాయి. ఈ మేరకు రాజ్యసభలో గురువారం ప్రవేశపెట్టిన అవినీతి నిరోధక బిల్లుకి ఆమోదం లభించింది. ఇప్పటికే అవినీతి కట్టడి కోసం దేశంలో చట్టాలు ఉన్నప్పటికీ.. చాలా మంది అధికారులు వాటిని ఖాతరు చేయడం లేదు. దీంతో.. పాత అవినీతి నిరోధక చట్టంలోని కొన్ని నిబంధనలను సవరిస్తూ.. తాజాగా బిల్లును సభలో ప్రవేశపెట్టారు. దీనికి మూజువాణి పద్ధతిలో ఓటింగ్‌ జరగగా.. సభ్యులు ఏకగ్రీవంగా మద్దతు తెలిపారు.
Samayam Telugu 2018_3img12_Mar_2018_PTI3_12_2018_000029B-1-768x331


నిబంధనల సవరణతో.. ఇకపై లంచం తీసుకునేవారికి మూడు నుంచి ఏడేళ్ల జైలు శిక్ష, జరిమానా విధించొచ్చు. అలానే లంచం ఇచ్చేవారికి కూడా ఇదే తరహాలో ఏడేళ్ల వరకూ జైలుశిక్ష, జరిమానా విధించనున్నారు. ఈ నిబంధన వ్యక్తులకే కాదు.. సంస్థలకి కూడా వర్తించనున్నాయి.

ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో లంచం ఇవ్వాల్సి వచ్చినవారు.. వారం రోజుల్లోపు అవినీతి నిరోధక అధికారులను సమాచారం అందించి.. శిక్ష నుంచి మినహాయింపు పొందవచ్చని కేంద్ర మంత్రి జితేంద్రసింగ్ తెలిపారు. అవినీతి కేసుల విచారణ వేగవంతంగా పూర్తిచేసేందుకే ఈ మేరకు నిబంధనలను సవరించినట్లు మంత్రి వివరించారు. ఇక.. ఈ బిల్లు లోక్‌సభ ఆమోదం పొందాల్సి ఉంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.