యాప్నగరం

సోనాలికి బీజేపీ ఎమ్మెల్యే శ్రద్ధాంజలి.. ట్రోలింగ్

ఫేక్ న్యూస్ ప్రచారం చేయోద్దని, ఇకనైనా బాధ్యతగా మసలుకోవాలని నెటిజన్లు చురకలంటిస్తుననారు.

Samayam Telugu 8 Sep 2018, 11:53 am
వివాదాస్పద వ్యాఖ్యలతో తరచుగా వార్తల్లో నిలిచే మహారాష్ట్ర బీజేపీ ఎమ్మెల్యే రామ్ కదమ్ మరోసారి తీవ్ర విమర్శల పాలయ్యారు. ప్రేమను తిరస్కరించిన అమ్మాయిల్ని కిడ్నాప్‌ చేసి పెళ్లిళ్లు జరిపిస్తానంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన రామ్‌ కదమ్ శుక్రవారం మరో భారీ తప్పిదాన్ని చేసి నాలుక్కరుచుకున్నారు. హీరోయిన్‌ సొనాలీ బింద్రే మరణించారని, ఆమెకు శ్రద్ధాంజలి ఘటిస్తూ పోస్ట్ చేసి సోషల్‌ మీడియాలో అడ్డంగా బుక్కయ్యారు. ‘హిందీ, మరాఠీ చిత్ర పరిశ్రమలో రాణించి మంచి పేరు తెచ్చుకున్న తార సోనాలి బింద్రే. అమెరికాలో ఆమె చనిపోయారు. ఆమెకు శ్రద్ధాంజలి’ అంటూ ఎమ్మెల్యే రామ్‌ కదమ్‌ ట్వీట్‌ చేశారు.
Samayam Telugu Ram Kadam And Sonali Bindre


అయితే ఇది ఫేక్‌ న్యూస్‌ అని నవీన్ ధావన్ అనే ట్విటర్ యూజర్ ఎమ్మెల్యే రామ్‌ కదమ్‌ పోస్టుపై స్పందించాడు. దీంతో తన తప్పు తెలుసుకునన రామ్ కదమ్.. గత రెండు రోజులుగా సోనాలి ఇక లేరన్న వార్త చక్కర్లు కొట్టడంతో నమ్మానని చెప్పారు. శ్రద్ధాంజలి ఘటిస్తున్నట్లు పేర్కొన్న ట్వీట్‌ను తొలగించిన రామ్ కదమ్.. సోనాలి అమెరికాలో చికిత్స తీసుకుంటున్నారు. ఆమె త్వరగా కోలుకొని సంతోషంగా, ఆరోగ్యంగా జీవించాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను’ అంటూ మరో ట్వీట్ చేశారు. అప్పటికే రామ్‌ కదమ్‌ చేసిన తప్పిదాన్ని నెటిజన్లు గుర్తించి ఆయనను విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. నటి సొనాలీ బింద్రే చనిపోయారంటూ ఫేక్ న్యూస్ ప్రచారం చేసింది మీరే నంటూ కామెంట్లు చేస్తున్నారు.


తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.