యాప్నగరం

కశ్మీర్ నేతకు కరోనా.. హోం క్వారంటైన్‌లో రాంమాధవ్, కేంద్ర మంత్రి

Ravinder Raina: జమ్ము కశ్మీర్‌లో బీజేపీ యువనాయకుడి అకాల మరణం. ఆయన కుటుంబసభ్యులను కలిసి పరామర్శించిన బీజేపీ నేతలు. కశ్మీర్ బీజేపీ చీఫ్‌కు కరోనా. ఆయనే వెంటే ఉన్న రాంమాధవ్. హోం క్వారంటైన్‌లో ఉన్నట్లు వెల్లడి.

Samayam Telugu 14 Jul 2020, 11:02 pm
మ్మూ కశ్మీర్ బీజేపీ చీఫ్ రవీందర్ రైనా కరోనా వైరస్ బారిపపడటం ఆ పార్టీలో అలజడి రేపుతోంది. ఈ వార్త తెలియగానే ఇటీవల ఆయనతో కలిసి ఓ కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ సహా బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాం మాధవ్ క్వారంటైన్‌‌‌లోకి వెళ్లిపోయారు. కశ్మీర్‌లో కొద్ది రోజుల కిందట బీజేపీ యువనాయకుడు వసీం బారి అకాల మరణం చెందారు. రవీందర్ రైనాతో పాటు రాం మాధవ్‌, కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ తదితరుల నేతలు వసీం బారి నివాసానికి వెళ్లి వారి కుటుంబసభ్యులను పరామర్శించారు. అక్కడ జరిగిన ఓ సంతాప కార్యక్రమంలో పాల్గొన్నారు.
Samayam Telugu బీజేపీ జాతీయ కార్యదర్శి రాం మాధవ్
Ram Madhav


కశ్మీర్ పర్యటనకు వెళ్లొచ్చిన తర్వాత రవీందర్ రైనాకు కరోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో ఆయణ్ని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ విషయం తెలియడంతో రాం మాధవ్ క్వారంటైన్ అయ్యారు. రైనా త్వరగా కోలుకోవాలంటూ ఆయన ట్వీట్ చేశారు. గడిచిన రెండు వారాల్లో తనకు నాలుగుసార్లు పరీక్షలు నిర్వహించగా నెగెటివ్ వచ్చిందని రాం మాధవ్ తెలిపారు.

‘నేను కొన్ని రోజులుగా క్వారంటైన్‌లో ఉన్నాను. నా సహచర బీజేపీ నేత, జమ్మూ కశ్మీర్ పార్టీ అధ్యక్షుడు రవీందర్ రైనాకు ఇవాళ కరోనా పాజిటివ్‌గా తేలింది. నేను 48 గంటల కిందట ఆయనతో పాటే ఉన్నాను. రెండు వారాలుగా ప్రయాణాలు చేస్తున్న నాకు 4 సార్లు టెస్టు చేయగా నెగటివ్‌గా నిర్ధారణ అయింది. అయినప్పటికీ నా కోసం, నా సన్నిహితుల కోసం జాగ్రత్తలు పాటిస్తున్నాను’ అని రాం మాధవ్ ట్వీట్ చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.