యాప్నగరం

రేపిస్ట్ బాబా ఆశ్రమంలో 500 మానవ కళేబరాలు?

ఇద్దరు సాధ్వీలపై అత్యాచారం కేసులో దోషిగా తేలిన డేరా సచ్చా సౌదా చీఫ్ గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ రోహతక్ జైలులో ఊచలు లెక్కిస్తున్నారు.

TNN 6 Sep 2017, 6:46 pm
ఇద్దరు సాధ్వీలపై అత్యాచారం కేసులో దోషిగా తేలిన డేరా సచ్చా సౌదా చీఫ్ గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ రోహతక్ జైలులో ఊచలు లెక్కిస్తున్నారు. అయితే ఆయన గతంలో చేసిన అకృత్యాలు రోజుకొకటి వెలుగుచూస్తూ సంచలనం సృష్టిస్తాయి. సిర్సాలోని డేరా ప్రధాన కార్యాలయం ఓ 'వండర్ ల్యాండ్' అంటూ బోలెడన్ని కథనాలు ఇప్పటికే వెలువడగా తాజాగా మరో దిగ్భ్రాంతికరమైన విషయం బయటకు వచ్చింది. డేరా ఆవరణలో తవ్వకాలు జరిపితే లెక్కకు మిక్కిలిగా మానవ కళేబరాలు బయటపడతాయని హర్యానాకు చెందిన మాజీ పాత్రికేయుడు రామానంద్ తతియా పేర్కొన్నారు. అంతేకాదు జాతీయ మీడియా సమక్షంలో ఈ తవ్వకాలను జరపాలని ఆయన సూచించారు.
Samayam Telugu ram rahim rape verdict senior journalist demands enquiry about dera chief crimes
రేపిస్ట్ బాబా ఆశ్రమంలో 500 మానవ కళేబరాలు?


రేపిస్ట్ బాబా గురించి మరిన్ని విషయాలను వెల్లడించి రామానంద్, తనను వ్యతిరేకించిన వారిని అత్యంత పాశవికంగా హత్యచేసి క్యాంపస్‌ లోపలే పూడ్చి పెట్టారని ఆరోపించారు. డేరా క్యాంపస్ మొత్తం జెల్లెడ పట్టి తవ్వకాలు జరిపితే కనిపించకుండాపోయిన సుమారు 500 మంది గురించి నిజానిజాలు బయటపడతాయన్నారు. డేరా అనుచరులను ముందస్తు జాగ్రత్తగా తమ మృతికి తామే కారణమంటూ అండర్‌టేకింగ్‌లు ఇవ్వమని కూడా అడిగారని రామానంద్ తతియా వెల్లడించారు. డేరా చీఫ్, ఆయన అనుచరులు తమకున్న పలుకుబడితో ఎందరో పేద ప్రజల భూములను బలవంతంగా స్వాధీనం చేసుకుని రాజసౌధాలను పోలిన విలాసవంతమైన భవంతులను సిర్సాలోనూ, వెలుపల నిర్మించుకున్నారని తతియా తెలిపారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.