యాప్నగరం

కేంద్ర మంత్రివర్గంలో స్వల్ప మార్పులు

Modi Cabinet: కేంద్ర మంత్రివర్గంలో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. రాంవిలాస్ పాశ్వాన్ నిర్వహించిన వినియోగదారుల వ్యవహారాలు, ఆహార, పౌర సరఫరా శాఖల బాధ్యతలను రైల్వే మంత్రి పీయూష్ గోయల్‌కు అప్పగిస్తూ ప్రధాని మోదీ నిర్ణయం తీసుకున్నారు.

Samayam Telugu 9 Oct 2020, 4:28 pm
కేంద్ర మంత్రివర్గంలో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. కేంద్ర మంత్రి, లోక్‌ జనశక్తి పార్టీ (LJP) వ్యవస్థాపకుడు రామ్ విలాస్‌ పాశ్వాన్ గురువారం (అక్టోబర్ 8) రాత్రి కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పాశ్వాన్ మంత్రిగా ఉన్న వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, పౌర సరఫరా మంత్రిత్వ శాఖల బాధ్యతలను మరో మంత్రి పీయూష్ గోయల్‌కు అప్పగించారు.
Samayam Telugu మోదీ క్యాబినెట్
Narendra Modi Cabinet


పీయూష్‌ గోయల్‌ ప్రస్తుతం రైల్వే శాఖ, వాణిజ్య, పన్నుల మంత్రిత్వ శాఖలను పర్యవేక్షిస్తున్నారు. వీటికి అదనంగా వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా సరఫరా మంత్రిత్వ శాఖల బాధ్యతలను చూసుకోనున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ సలహా మేరకు పీయూష్ గోయల్‌కు అదనపు బాధ్యతలను కల్పిస్తూ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు రాష్ట్రపతి భవన్‌ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపింది.

పార్లమెంట్‌కు 8 సార్లు ప్రాతినిధ్యం వహించిన నేతగా, దళిత నేతగా దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు సాధించిన కేంద్ర మంత్రి రాంవిలాస్‌ పాశ్వాన్ గురువారం సాయంత్రం కన్నుమూశారు. ఇటీవల ఢిల్లీలోని హాస్పిటల్‌లో గుండెకు శస్త్రచికిత్స చేయించుకొన్న ఆయన.. 5 వారాలుగా అక్కడే చికిత్స పొందుతూ హఠాన్మరణం చెందారు. ఈ విషయాన్ని ఆయన కుమారుడు, LJP చీఫ్, లోక్‌సభ సభ్యుడు చిరాగ్‌ పాశ్వాన్ ట్విటర్‌ ద్వారా వెల్లడించారు. బిహార్‌ ఎన్నికల సమయంలో రామ్ విలాస్ పాశ్వాన్ మృతి చెందడం ఆ పార్టీ వర్గాలను శోకసంద్రంలో ముంచింది. పాశ్వాన్ మృతికి రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధాని సహా పలువురు రాజకీయ ప్రముఖులు సంతాపం ప్రకటించారు.

Also Read: పార్టీ ఏదైనా, ప్రధాని ఎవరైనా.. ఓ మంత్రి పాశ్వాన్; దేశ రాజకీయాల్లో విలక్షణ నేత!

Don't Miss: నిరసనల పేరుతో జనజీవనానికి ఇబ్బంది కలిగించొద్దు: సుప్రీంకోర్టు

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.