Wrestlers Protest: ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఆందోళన చేస్తున్న రెజ్లర్లకు.. మద్దతు పెరుగుతోంది. తాజాగా.. కాంగ్రెస్ ముఖ్యనేత రణదీప్ సింగ్ సూర్జేవాలా రెజ్లర్లకు మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. 'ఈ పోరాటం ఒక్కరిది కాదు.. ప్రజలది. ఈ పోరాటం ఏ కులానికి చెందినది కాదు.. ఈ పోరాటం యావత్ దేశానిది. ఇది యువత పోరాటం' అని సూర్జేవాలా (Randeep Surjewala) వ్యాఖ్యానించారు. దేశ యువతకు అన్యాయం జరుగుతోందని సూర్జేవాలా ఆరోపించారు. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు.. పోర్బందర్ నుంచి మిజోరాం వరకు.. ప్రతీ ఒక్కరూ రెజ్లర్లకు అండగా నిలవాల్సిన అవసరం ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీ తరఫున రెజ్లర్లకు అండగా నిలుస్తామని స్పష్టం చేశారు. ‘దేశంలోని ఆడబిడ్డలు ఆర్తనాదాలు చేస్తుంటే.. ఈ ప్రభుత్వానికి ఎందుకు వినిపించడం లేదు’ అని ట్వీట్ చేశారు.
Wrestlers Protest: ఆడబిడ్డల ఆర్తనాదాలు మీకు వినిపించడం లేదా?: సూర్జేవాలా
Wrestlers Protest: రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ను అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ.. రెజ్లర్లు నిరసన చేస్తున్నారు. వారి నిరసన ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద 26వ రోజు కొనసాగింది. కాంగ్రెస్ నేత రణదీప్ సింగ్ సూర్జేవాలా రెజ్లర్లకు మద్దతు తెలిపారు. కేంద్ర ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు.
ప్రధానాంశాలు:
- ఢిల్లీలో 26వ రోజూ కొనసాగిన రెజ్లర్ల నిరసన
- రెజ్లర్లకు మద్దతు తెలిపిన రణదీప్ సూర్జేవాలా
- బ్రిజ్ భూషణ్పై చర్యలు తీసుకోవాలని డిమాండ్