ఒడిశా: రెండు తలలు, మూడు చేతులతో అవిభక్త కవలలు జననం
జన్యుపరమైన లోపం కారణంగా గర్భంలో శరీర భాగాలు ఒక్కటిగా కలిసిపోయి అవిభక్త కవలలుగా రూపాంతరం చెందుతాయి. దాదాపు రెండు లక్షల మందిలో ఒకరికి ఇలా జరుగుతుంది.
Samayam Telugu 12 Apr 2021, 7:07 am
ప్రధానాంశాలు:
- రెండో కాన్పులో మహిళకు అవిభక్త కవలలు జననం.
- ఒకే శరీరం రెండు తలలతో అవిభక్త కవలలు.
- ఛాతి, కడుపు అతుక్కున్నట్టు తెలిపిన వైద్యులు.
ఒడిశాలోని ఓ మహిళ అవిభక్త కవలలకు (ఆడశిశువులు) జన్మనిచ్చింది. కేంద్రపడ జిల్లా రాజ్నగర్ సమితి కనా గ్రామానికి చెందిన మహిళకు ఆదివారం ఉదయం పురిటి నొప్పులు రావడంతో ఆమె భర్త ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు. పరీక్షల అనంతరం మహిళకు వైద్యులు శస్త్రచికిత్స నిర్వహించి ప్రసవం చేశారు. ఆమె కడుపులో బిడ్డను చూసి వైద్యులు షాక్ తిన్నారు. అవిభక్త కవలలకు రెండు తలలు, మూడు చేతులు, రెండు కాళ్లు మాత్రమే ఉండటం, వారి పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం కేంద్రపడ జిల్లా ప్రధాన ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అక్కడ చికిత్స అనంతరం వీరిని కటక్ శిశుభవన్లో ఉంచారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన ఆరోగ్య కేంద్రం పీడియాట్రిషియన్ దేబాసిస్ సాహు మీడియాతో మాట్లాడుతూ.. జన్యుపరమైన లోపాల కారణంగా ఇలా జన్మిస్తారని, కవలలిద్దరి ఛాతి, కడుపు అతుక్కొని ఉన్నాయని పేర్కొన్నారు. ప్రస్తుతానికి వీరి ఆరోగ్యానికి ప్రమాదమేమీ లేదని తెలిపారు. అయితే, అల్ట్రాసౌండ్ పరీక్షల తర్వాత మరిన్ని వివరాలును వెల్లడిస్తామని అన్నారు. కొన్నిసార్లు అరుదుగా ఇలా జరుగుతుందని వ్యాఖ్యానించారు.
శరీరం ఒకటే అయినా.. రెండు నోళ్లతో పాలు తాగుతోందని వివరించారు. ప్రస్తుతం నవజాత శిశువు ఆరోగ్యంగానే ఉందని, ప్రత్యేక చికిత్స కోసం కటక్లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ పోస్ట్-గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పీడియాట్రిక్స్కు తరలించామని ఆయన తెలిపారు. కూలి పనులు చేసే తాము ఈ కవలలను ఎలా కాపాడుకోవాలని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తమకు సహకరించాలని కోరుతున్నారు. మహిళకు రెండో కాన్పులో అవిభక్త కవలలు జన్మించారు.
అవిభక్త కవలలకు శరీరంలో అన్ని భాగాలు వేర్వేరుగా ఉంటే శస్త్రచికిత్స ద్వారా వేరుచేసే అవకాశం ఉంటుంది. అయితే, ఇవి విజయవంతమవుతాయని గ్యారెంటీ లేదు. ఈ భయంతోనే అవిభక్త కవలలు వీణ-వాణిలకు వారి తల్లిదండ్రులు శస్త్రచికిత్స నిర్వహించడానికి వెనుకాడు. ఆపరేషన్ చేస్తే ఒకరే బ్రతికే చాన్స్ ఉందని, ఆపరేషన్ సక్సెస్ అవుతుంది అన్న గ్యారెంటీ లేదని చెప్పటంతో ఆపరేషన్ ఆలోచన విరమించుకున్నారు. అవిభక్త కవలలుగా వీరు అనుభవిస్తున్న నరకం అంతా ఇంతా కాదు . వీరిలో ఒకరి ముఖం కింది వైపు చూస్తుంటే.. మరొకరిది పైకి చూస్తుంది.
2017లో ఒడిశాకు చెందిన అవిభక్త కవలలు జాగా-కలియాలను ఢిల్లీ ఎయిమ్స్ వైద్యులు 45 గంటలపాటు తీవ్రంగా శ్రమించి శస్త్రచికిత్స అనంతరం వేరచేశారు. వీరిని తర్వాత కటక్లోని శిశుభవన్లో ఉంచి చికిత్స అందజేస్తుండగా.. గతేడాది నవంబరులో ఒకరు మృతిచెందారు.
శరీరం ఒకటే అయినా.. రెండు నోళ్లతో పాలు తాగుతోందని వివరించారు. ప్రస్తుతం నవజాత శిశువు ఆరోగ్యంగానే ఉందని, ప్రత్యేక చికిత్స కోసం కటక్లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ పోస్ట్-గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పీడియాట్రిక్స్కు తరలించామని ఆయన తెలిపారు. కూలి పనులు చేసే తాము ఈ కవలలను ఎలా కాపాడుకోవాలని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తమకు సహకరించాలని కోరుతున్నారు. మహిళకు రెండో కాన్పులో అవిభక్త కవలలు జన్మించారు.
అవిభక్త కవలలకు శరీరంలో అన్ని భాగాలు వేర్వేరుగా ఉంటే శస్త్రచికిత్స ద్వారా వేరుచేసే అవకాశం ఉంటుంది. అయితే, ఇవి విజయవంతమవుతాయని గ్యారెంటీ లేదు. ఈ భయంతోనే అవిభక్త కవలలు వీణ-వాణిలకు వారి తల్లిదండ్రులు శస్త్రచికిత్స నిర్వహించడానికి వెనుకాడు. ఆపరేషన్ చేస్తే ఒకరే బ్రతికే చాన్స్ ఉందని, ఆపరేషన్ సక్సెస్ అవుతుంది అన్న గ్యారెంటీ లేదని చెప్పటంతో ఆపరేషన్ ఆలోచన విరమించుకున్నారు. అవిభక్త కవలలుగా వీరు అనుభవిస్తున్న నరకం అంతా ఇంతా కాదు . వీరిలో ఒకరి ముఖం కింది వైపు చూస్తుంటే.. మరొకరిది పైకి చూస్తుంది.
2017లో ఒడిశాకు చెందిన అవిభక్త కవలలు జాగా-కలియాలను ఢిల్లీ ఎయిమ్స్ వైద్యులు 45 గంటలపాటు తీవ్రంగా శ్రమించి శస్త్రచికిత్స అనంతరం వేరచేశారు. వీరిని తర్వాత కటక్లోని శిశుభవన్లో ఉంచి చికిత్స అందజేస్తుండగా.. గతేడాది నవంబరులో ఒకరు మృతిచెందారు.