దేశంలోని అద్భుతమైన కట్టడాల్లో ఒకటి రాష్ట్రపతి భవన్ . బ్రిటీష్ కాలంలో నిర్మించిన ఈ భవనం ఇప్పటికీ చెక్కుచెదరకుండా ఉంది. భారత, మొఘల్, బౌద్ధ సాంప్రదాయ నిర్మాణశైలితో, విశాలమైన గదులు, అహ్లాదకర ఉద్యానవనాలు, పచ్చిక బయళ్లు, ఫౌంటెయిన్లతో ఎన్నో విశేషాలకు ఇది పెట్టింది పేరు. రాష్ట్రపతి ఎన్నికల నేపథ్యంలో.. ఓసారి రాష్ట్రపతి భవనం విశిష్టతలు గురించి కూడా తెలుసుకుందామా...
1912-1929 మధ్యకాలంలో రాష్ట్రపతి భవన్ నిర్మించారు. అంటే, దాదాపు 17 ఏళ్లపాటు నిర్మాణం సాగింది. ఇందుకు రూ.1.40 కోట్లు వెచ్చించారు. ఇందులో మొదట లార్డ్ ఎర్విన్ వైస్రాయ్ కుటుంబం నివాసించారు. స్వాతంత్ర్యం తర్వాత 1950లో ఈ భవనాన్ని రాష్ట్రపతి భవన్గా మార్చారు. 330 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ భవనంలోని 4 అంతస్థుల్లో మొత్తం 340 గదులు ఉన్నాయి. 64 లివింగ్ రూమ్స్ ఉన్నాయి. మార్బల్ హాల్, కిచెన్ మ్యూజియం, చిల్డ్రెన్ గ్యాలరీ, గిఫ్ట్ మ్యూజియం, దర్బార్ హాల్, లైబ్రరీ, అశోక హాల్, మొఘల్ గార్డెన్లు ఈ భవనం ప్రత్యేకతలు. భారతీయ సాంప్రదాయాలకు అనుగుణంగా.. మొఘల్, బౌద్ధ నిర్మాణాల తరహాలో ఈ భవనం నిర్మించారు.
మీరు కూడా చూడొచ్చు...
రాష్ర్టపతి భవనాన్ని సందర్శించాలనుకునేవారు ఆన్లైన్ ద్వారా వివరాలను నమోదు చేసుకోవచ్చు. రాష్ట్రపతి భవన్ వెబ్సైట్లోకి వెళ్లి ఎక్స్ప్లోర్ అండ్ టూర్ రాష్ట్రపతి భవన్ ఆప్షన్ను క్లిక్ చేయండి. లేదా http://rashtrapatisachivalaya.gov.in/rbtour యూఆర్ఎల్ను క్లిక్ చేయండి. ప్లాన్ యువర్ విజిట్ క్లిక్ చేసి, రాష్ట్రపతి భవన్లో ఏయే విభాగాలు చూడాలని అనుకుంటున్నారో ఎంపిక చేసుకోండి. ప్రవేశ రుసము రూ.50 మాత్రమే. దీన్ని ఆన్లైన్ ద్వారా చెల్లించే సదుపాయం ఉంది. 12 ఏళ్ల వయస్సు లోపు పిల్లలకు ప్రవేశం ఉచితం. మీ ఆధారలన్నీ పరిశీలించిన తర్వాత మాత్రమే మీకు రాష్ట్రపతి భవన్కు అనుమతి ఇస్తారు. ఇంకెందుకు ఆలస్యం. ఈ రోజే సిద్ధమైపోండి మరి.
1912-1929 మధ్యకాలంలో రాష్ట్రపతి భవన్ నిర్మించారు. అంటే, దాదాపు 17 ఏళ్లపాటు నిర్మాణం సాగింది. ఇందుకు రూ.1.40 కోట్లు వెచ్చించారు. ఇందులో మొదట లార్డ్ ఎర్విన్ వైస్రాయ్ కుటుంబం నివాసించారు. స్వాతంత్ర్యం తర్వాత 1950లో ఈ భవనాన్ని రాష్ట్రపతి భవన్గా మార్చారు. 330 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ భవనంలోని 4 అంతస్థుల్లో మొత్తం 340 గదులు ఉన్నాయి. 64 లివింగ్ రూమ్స్ ఉన్నాయి. మార్బల్ హాల్, కిచెన్ మ్యూజియం, చిల్డ్రెన్ గ్యాలరీ, గిఫ్ట్ మ్యూజియం, దర్బార్ హాల్, లైబ్రరీ, అశోక హాల్, మొఘల్ గార్డెన్లు ఈ భవనం ప్రత్యేకతలు. భారతీయ సాంప్రదాయాలకు అనుగుణంగా.. మొఘల్, బౌద్ధ నిర్మాణాల తరహాలో ఈ భవనం నిర్మించారు.
మీరు కూడా చూడొచ్చు...
రాష్ర్టపతి భవనాన్ని సందర్శించాలనుకునేవారు ఆన్లైన్ ద్వారా వివరాలను నమోదు చేసుకోవచ్చు. రాష్ట్రపతి భవన్ వెబ్సైట్లోకి వెళ్లి ఎక్స్ప్లోర్ అండ్ టూర్ రాష్ట్రపతి భవన్ ఆప్షన్ను క్లిక్ చేయండి. లేదా http://rashtrapatisachivalaya.gov.in/rbtour యూఆర్ఎల్ను క్లిక్ చేయండి. ప్లాన్ యువర్ విజిట్ క్లిక్ చేసి, రాష్ట్రపతి భవన్లో ఏయే విభాగాలు చూడాలని అనుకుంటున్నారో ఎంపిక చేసుకోండి. ప్రవేశ రుసము రూ.50 మాత్రమే. దీన్ని ఆన్లైన్ ద్వారా చెల్లించే సదుపాయం ఉంది. 12 ఏళ్ల వయస్సు లోపు పిల్లలకు ప్రవేశం ఉచితం. మీ ఆధారలన్నీ పరిశీలించిన తర్వాత మాత్రమే మీకు రాష్ట్రపతి భవన్కు అనుమతి ఇస్తారు. ఇంకెందుకు ఆలస్యం. ఈ రోజే సిద్ధమైపోండి మరి.