యాప్నగరం

చివరికి కార్లో ఢిల్లీ బయలుదేరిన ఎంపీ రవీంద్ర

తనపై విమానాల్లో ప్రయాణించకుండా నిషేదం విధించిన నేపథ్యంలో శివసేన ఎంపీ రవీంద్ర గైక్వాడ్ చివరికి కార్లో ఢిల్లీకి బయలుదేరారు.

TNN 29 Mar 2017, 1:48 pm
తనపై విమానాల్లో ప్రయాణించకుండా నిషేదం విధించిన నేపథ్యంలో శివసేన ఎంపీ రవీంద్ర గైక్వాడ్ చివరికి కార్లో ఢిల్లీకి బయలుదేరారు. అత్యంత విశ్వసనీయ సమాచారం ప్రకారం గైక్వాడ్ పార్లమెంటు సమావేశాలకు హాజరయ్యేందుకు కార్లో ఢిల్లీ ప్రయాణమైనట్లు తెలిసింది. అయితే బుధవారం ఆయన సమావేశాలకు హాజరుకావడం లేదని ఆయన సన్నిహితులు తెలిపారు. గురువారం సమావేశాలకు హాజరవుతారని తెలిసింది.
Samayam Telugu ravindra gaikwad finally travels by car to delhi
చివరికి కార్లో ఢిల్లీ బయలుదేరిన ఎంపీ రవీంద్ర


ముంబై నుంచి ఢిల్లీ విమానంలో ప్రయాణించేందుకు గైక్వాడ్ కు వీలు కాకపోవడంతో... ఆయన మంగళవారం హైదరాబాద్ నుంచి ఢిల్లీ విమానం బుక్ చేసుకున్నారు. కానీ, సదరు విమాన సంస్థ ఆ టిక్కెట్ ను కేన్సిల్ చేసింది.

గత గురువారం ఆయన ఎయిరిండియా మేనేజర్ సుకుమార్ పై చెప్పుతో దాడి చేసిన సంగతి తెలిసిందే. గైక్వాడ్ పై పలు చోట్ల కేసులు నమోదైనా శివసేన అధిష్టానం ఇంతవరకు స్పందించలేదు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.