ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ ఎట్టకేలకు మౌనం వీడారు. నోట్ల రద్దు నిర్ణయం తీసుకున్నప్పటి నుంచి ఈ అంశంపై ఉర్జిత్ ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. ఈ అంశంపై ఆర్బీఐ గవర్నర్ వివరణ ఇవ్వాలంటూ ప్రతిపక్ష పార్టీలు డిమాండ్ చేస్తూ వచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన స్సందిస్తూ.. నోట్ల రద్దు నిర్ణయంతో బ్లాక్ మనీని అరికట్టవచ్చని వ్యాఖ్యనించారు. తాజా నిర్ణయంతో నిజాయితీపరులు కూడా ఇబ్బందులు పడుతున్నారని.. ఈ ఇబ్బందులు తాత్కాలికమేనని వెల్లడించారు. నిజాయితీపరుల ఇబ్బందులు లేకుండా ఉండేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. నోట్ల రద్దు నిర్ణయంతో బ్యాంకుల్లో నగదు వరదలా పారుతోందన్నారు. ఫలితంగా నగదు ఉపయోగంలోకి వస్తోందన్నారు. నగదు విషయంలో ఎవరూ ఆందోళన చెందవద్దని.. బ్యాంకుల్లో, ఏటీఎంలలో నగదు లభ్యత రోజు రోజుకు పెరుగుతూ వస్తోందని.. సాధ్యమైనంత త్వరలో నగదు కొరత లేకుండా చేస్తామని ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ వెల్లడించారు.
ఎట్టకేలకు మౌనం వీడిన ఆర్బీఐ గవర్నర్ !
పెద్ద నోట్ల రద్దు అంశంపై ఆర్బీఐ ఉర్జిత్ పటేల్ తొలిసారి స్పందించారు.
TNN 27 Nov 2016, 7:25 pm