యాప్నగరం

నేపాల్‌కు భారీగా భారత్ వందనోట్లు

నేపాల్‌కు రూ.100కోట్ల విలువైన రూ.100ల నోట్లను పంపిణీ చేసేందుకు భారతీయ రిజర్వ్‌ బ్యాంకు (ఆర్బీఐ) నిర్ణయించింది.

Samayam Telugu 7 Jan 2017, 9:32 am
నేపాల్‌కు రూ.100కోట్ల విలువైన రూ.100ల నోట్లను పంపిణీ చేసేందుకు భారతీయ రిజర్వ్‌ బ్యాంకు (ఆర్బీఐ) నిర్ణయించింది. భారత్‌లో పెద్ద నోట్లరద్దు ప్రభావంతో ఇబ్బందులుపడుతున్న నేపాల్‌ ప్రజలకు ఉపశమనం కలిగించేందుకు ఈ నిర్ణయం తీసుకొంది. పొరుగు దేశమైన నేపాల్‌లో భారత కరెన్సీ భారీగానే చలామణీలో ఉంది. ముఖ్యంగా సరిహద్దు పరిసర ప్రాంతాల ప్రజలకు ఇండియన్‌ కరెన్సీ అవసరం అధికంగా ఉంటుంది. వివిధ అవసరాల నిమిత్తం నిత్యం వేలాదిమంది నేపాలీలు భారత్‌కు రాకపోకలు సాగిస్తుంటారు. నవంబర్ 8 తర్వాత నోట్లమార్పిడికి తీవ్ర ఇబ్బందులు నెలకొన్నాయి.
Samayam Telugu rbi sends indian currency to nepal
నేపాల్‌కు భారీగా భారత్ వందనోట్లు


కొంతకాలంగా తమ దేశంలోని కరెన్సీని చలామణీ చేసుకునేలా అవకాశం కల్పించాలని నేపాల్‌ రాష్ట్ర బ్యాంకు కోరుతోంది. దీనిపై స్పందించిన ఆర్బీఐ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ నెలాఖరులోగా నేపాల్‌కు రూ.వంద కోట్ల విలువైన రూ.100 నోట్లను ఆర్‌బీఐ పంపించేందుకు ఏర్పాటు చేస్తోంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.