యాప్నగరం

బంధువులకూ దక్కని ‘అమ్మ’ దర్శనం!

తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్యంపై ప్రజలు, బంధువులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

TNN 6 Oct 2016, 12:07 pm
తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్యంపై ప్రజలు, బంధువులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 12రోజులుగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నా ఇంతవరకు ఆమె కోలుకోకపోవడం...ప్రభుత్వం, ఆమె చికిత్స పొందుతున్న ఆసుపత్రి వైద్యులూ హెల్త్ బులెటిన్లు రెగ్యులర్ గా విడుదల చేయకపోవడంతో రోజురోజుకు ఆందోళన పెరిగిపోతుంది.
Samayam Telugu relatives barred to visit jayalalithaa
బంధువులకూ దక్కని ‘అమ్మ’ దర్శనం!

గతవారం ఆమెకు లండన్ కు చెందిన డాక్టర్ రిచర్డ్ బీలే వైద్య చికిత్సలు నిర్వహించిన సంగతి తెలిసిందే.
ప్రస్తుతం ఆమెకు ఆల్ ఇండియా మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) ఢిల్లీ వైద్యులు వైద్య చికిత్సలు అందిస్తున్నారు.
న్యూమోనియా స్పెషలిస్ట్ డాక్టర్ జి.సి.కిల్నాని, కార్డియాలజిస్టు డాక్టర్ నితీష్ నాయక్, ఎనేస్థేషియాలజిస్ట్ డాక్టర్ అంజన్ త్రిక్క వైద్యుల బృందం జయలలితకు చికిత్స అందిస్తున్నారని కేంద్రఆరోగ్యశాఖ వెల్లడించింది.

ఇదిలా ఉండగా, అమ్మ ఆరోగ్యంపై వైద్యులు, ప్రభుత్వం మంగళవారం తరువాత ఏలాంటి హెల్త్ బులెటిన్ రిలీజ్ చేయలేదు.
మరోవైపు ఆమెను పరామార్శించేందుకు బంధువులను సైతం ఆసుపత్రిలోకి అనుమతించడం లేదు. మూడు రోజులుగా జయలలిత చికిత్స పొందుతున్న ఆపోలో హాస్పిటల్స్ (గ్రహెమ్స్ రోడ్) గేటు దగ్గర పడిగాపులు కాస్తున్న ఆమె సమీప బంధువు (తమ్ముడి కూతురు) దీప జయశంకర్ ను లోపలికి అనుమతించడం లేదు.



‘ మా ఆంటీనీ చూడాలని మూడురోజులుగా గేటు దగ్గరే వేచి చూస్తున్నా..నన్ను అనుమతించడం లేదు. మా అత్తను చూసేంత వరకు నేను ఇక్కడి నుంచి కదిలేదని’ దీప అంటోంది.
తమ ఆంటీని చూసేందుకు ఎవరో అధికారులు వచ్చి తనను లోపలికి తీసెకెళ్తామని చెబుతున్నారు కానీ ఇంతవరకు ఎవరూ రావడం లేదని ఆమె వాపోయారు.

జయలలిత ఆరోగ్యంపై తెలుసుకోవాల్సిన అవసం తమకు, ప్రజలకు ఎంతో ఉందని, మంగళవారం నుంచి ఏలాంటి హెల్త్ బులెటిన్ విడుదల చేయకపోవడంపై ఆందోళన చెందుతున్నామని ఆమె అన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.