యాప్నగరం

నకిలీ డిగ్రీ కేసులో కేంద్ర మంత్రి స్మృతికి ఊరట

కేంద్ర మంత్రి స్మృతి ఇరానీకి నలికీ డిగ్రీ కేసు నుంచి మోక్షం లభించింది.

TNN 18 Oct 2016, 5:39 pm
నకిలీ డిగ్రీ కేసులో కేంద్ర మంత్రి స్మృతి ఇరానీకి ఊరట లభించింది. ఈ కేసులో ఆమెకు సమన్లు జారీ చేయలేమని ఢిల్లీ పాటియాల కోర్టు స్పష్టం చేసింది. నకిలీ డిగ్రీ కేసులో స్మృతికి సమన్లు జారీ చేయాలని వేసిన పిటిషన్ పై మంగళవారం విచారణ జరిపిన కోర్టు.. ఆమె ఎన్నికల కమిషన్ కు తప్పుడు విద్యార్హతలు సమర్పించారనే దానికి ఆధారాలు లేవని పేర్కొంది. ఎలాంటి ఆధారాలు లేకుండా ఆమెకు సమన్లు ఎలా జారీచేస్తామని పిటిషనర్ తరఫున న్యాయవాదిని కోర్టు ప్రశ్నించింది..
Samayam Telugu relief for smuriti irani in delhi court on fake degree case
నకిలీ డిగ్రీ కేసులో కేంద్ర మంత్రి స్మృతికి ఊరట


గత ఎన్నికల సమయంలో కేంద్ర మంత్రి స్మృతి విద్యార్హతలు సంబంధించి తప్పుడు సమాచారం ఇచ్చారని ఆమెపై ప్రతిపక్షాలు విమర్శల వర్షం కురిపించిన విషయం తెలిసిందే. ఢిల్లీ వర్శిటీ నుంచి బీఏ డిగ్రీని పూర్తి చేసినట్లు స్మృతి ఇరానీ ఎన్నికల కమిషన్ కు తప్పుడు సమాచారం ఇచ్చారని ప్రతిపక్షాలు ఆమెపై ఆరోపణలు చేశాయి. ఈ నేపథ్యంలో స్మృతి విద్యార్హతలపై ఢిల్లీకోర్టులో పిటిషన్ దాఖలు చేయాల్సి వచ్చింది.


తాజా తీర్పుపై బీజేపీ నేతలు హర్షం వ్యక్తం చశారు. ప్రతిపక్షాల తప్పుడు ఆరోపణలు కోర్టులో నిరూపితం కావని చెప్పడానికి ఈ తీర్పే నిదర్శమని బీజేపీ అంటోంది.. ఇదిలా ఉండగా ఈ తీర్పు ను హైకోర్టులో సవాల్ చేస్తామని ప్రతిపక్ష నేతలు పేర్కొంటున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.