కరోనా వైరస్ కట్టడికి విధించిన లాక్డౌన్ కారణంగా వాయిదాపడ్డ 10, 12 తరగతులకు సంబంధించిన కొన్ని పరీక్షలను రద్దుచేసినట్టు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకెండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) తెలిపింది. జులై నుంచి 15 మంది జరగాల్సిన పరీక్షలను రద్దుచేస్తున్నామని ఈ మేరకు సుప్రీంకోర్టు వివరించింది. పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పుడే పరీక్షలను నిర్వహించాలని నిర్వహించాలని నిర్ణయించినట్టు సీబీఎస్ఈ, కేంద్ర మానవవనరుల శాఖ సంయుక్తంగా సుప్రీంకోర్టుకు తెలియజేశాయి. పరీక్షల నిర్వహణకు సంబంధించిన వివరాలను సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా సుప్రీంకోర్టు తెలియజేశారు.
దేశంలో కరోనా వైరస్ ప్రభావం బోర్డు పరీక్షలపై కూడా పడింది. మార్చి తొలివారం నుంచి కరోనా పాజిటివ్ కేసులు క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో మార్చి 19 నుంచి 31 వరకు జరగాల్సిన పది, పన్నెండో తరగతి పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు గతంలోనే ప్రకటించింది. అనంతరం పరీక్షల రీషెడ్యూల్ను మే 26న ప్రకటించింది. సీబీఎస్ఈ 10, 12 తరగతుల పరీక్షలను దేశవ్యాప్తంగా 15 వేల కేంద్రాల్లో నిర్వహించనున్నట్టు కేంద్ర మానవవనరుల శాఖ వెల్లడించింది.
సామాజిక దూరాన్ని పాటించేందుకూ, విద్యార్థులు ఎక్కువ దూరం ప్రయాణించే అవసరం లేకుండా ఉండేందుకూ, అత్యధిక పరీక్ష కేంద్రాలను ఎంపిక చేసినట్టు గతంలో తెలిపింది. కానీ ప్రస్తుతం దేశంలో కరోనా వైరస్ కేసులు తీవ్రత ఎక్కువ కావడంతో పరీక్షల నిర్వహణ కష్టమని భావించింది. ఓవైపు తల్లిదండ్రులు కూడా ఆందోళన చెందడంతో బోర్డు తాజా నిర్ణయం తీసుకుంది.
దేశంలో కరోనా వైరస్ ప్రభావం బోర్డు పరీక్షలపై కూడా పడింది. మార్చి తొలివారం నుంచి కరోనా పాజిటివ్ కేసులు క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో మార్చి 19 నుంచి 31 వరకు జరగాల్సిన పది, పన్నెండో తరగతి పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు గతంలోనే ప్రకటించింది. అనంతరం పరీక్షల రీషెడ్యూల్ను మే 26న ప్రకటించింది. సీబీఎస్ఈ 10, 12 తరగతుల పరీక్షలను దేశవ్యాప్తంగా 15 వేల కేంద్రాల్లో నిర్వహించనున్నట్టు కేంద్ర మానవవనరుల శాఖ వెల్లడించింది.
సామాజిక దూరాన్ని పాటించేందుకూ, విద్యార్థులు ఎక్కువ దూరం ప్రయాణించే అవసరం లేకుండా ఉండేందుకూ, అత్యధిక పరీక్ష కేంద్రాలను ఎంపిక చేసినట్టు గతంలో తెలిపింది. కానీ ప్రస్తుతం దేశంలో కరోనా వైరస్ కేసులు తీవ్రత ఎక్కువ కావడంతో పరీక్షల నిర్వహణ కష్టమని భావించింది. ఓవైపు తల్లిదండ్రులు కూడా ఆందోళన చెందడంతో బోర్డు తాజా నిర్ణయం తీసుకుంది.