మానవ సేవ కన్నా మిన్న లేదని చాటిన మహిళామణి మదర్ థెరిస్సా. ఈ దేశంలో పుట్టకపోయినా, ఈ దేశంలోని ఆపన్నులు, ఆర్తులు, ఆపదలో ఉన్నవారిని ఆదుకొనుటలో ఆమెను మించిన వారు లేరు. ప్రపంచంలోని గొప్ప మహిళామణులలో ఎవరు అంటే ఆమె పేరు పేర్కొనకుండా వేరొకరి పేరు చెప్పటానికి కుదరదు. అందుకే ఆమె ప్రపంచంలోనే అత్యంత గౌరవనీయమైన వనిత అనటంలో ఏమాత్రం అతిశయోక్తి ఉండదు. అలాంటి అమ్మ వర్ధంతి నేడు.
1910 ఆగష్టు 26న అల్బేనియా దేశంలోని(ఇప్పుడు స్కోప్టే,మాసిడోనియా)యొక్క ముఖ్య పట్టణంలో జన్మించారు. 1929 జనవరి 6వ తేదిన భారతదేశంలోని కలకత్తా నగరం చేరుకున్నది. అప్పటినుండి విద్యాబోధన చేస్తూ... 1947లో పేదరికాన్ని స్వీకరిస్తున్నట్లు ప్రమాణం చేసింది. ‘శాంతినగర్’ అనే పేరుతో అసన్సోల్ నగరంలో ఒక కాలనీ కట్టుకునేటట్లు కుష్టు రోగం గలవారిని ప్రోత్సహించింది.
1952 లో మదర్ థెరీసా కలకత్తా నగరంలో మొదటి హోమ్ ఫర్ ది డయింగ్ ను ప్రారంభించారు.భారతదేశ అధికారుల సహాయంతో ఆమె ఒక పాడుబడిన హిందూ దేవాలయాన్ని పేద ప్రజల ధర్మశాలగా మార్చారు.ఆమె దానికి కాళీఘాట్ పరిశుద్ధ హృదయ నిలయం ( కాళీఘాట్ హోం ఫర్ ది డయింగ్) (నిర్మల్ హృదయ్) గా పేరు పెట్టారు స్ర్తీ ధార్మిక సమాఖ్య, మిషనరీస్ ఆఫ్ చారిటీ అనే ధార్మిక సంస్థను నెలకొల్పింది. పద్మశ్రీ, భారతరత్న లాంటి అత్యున్నత పురస్కారాలు మదర్ థెరిస్సాకు అందించారు. ఆమె చేసిన సేవలు శాంతి బోధనకు ప్రపంచ అత్యున్నత పురస్కారం నోబెల్ శాంతి బహుమతి ఆమెను వరించింది.
1910 ఆగష్టు 26న అల్బేనియా దేశంలోని(ఇప్పుడు స్కోప్టే,మాసిడోనియా)యొక్క ముఖ్య పట్టణంలో జన్మించారు. 1929 జనవరి 6వ తేదిన భారతదేశంలోని కలకత్తా నగరం చేరుకున్నది. అప్పటినుండి విద్యాబోధన చేస్తూ... 1947లో పేదరికాన్ని స్వీకరిస్తున్నట్లు ప్రమాణం చేసింది. ‘శాంతినగర్’ అనే పేరుతో అసన్సోల్ నగరంలో ఒక కాలనీ కట్టుకునేటట్లు కుష్టు రోగం గలవారిని ప్రోత్సహించింది.
1952 లో మదర్ థెరీసా కలకత్తా నగరంలో మొదటి హోమ్ ఫర్ ది డయింగ్ ను ప్రారంభించారు.భారతదేశ అధికారుల సహాయంతో ఆమె ఒక పాడుబడిన హిందూ దేవాలయాన్ని పేద ప్రజల ధర్మశాలగా మార్చారు.ఆమె దానికి కాళీఘాట్ పరిశుద్ధ హృదయ నిలయం ( కాళీఘాట్ హోం ఫర్ ది డయింగ్) (నిర్మల్ హృదయ్) గా పేరు పెట్టారు స్ర్తీ ధార్మిక సమాఖ్య, మిషనరీస్ ఆఫ్ చారిటీ అనే ధార్మిక సంస్థను నెలకొల్పింది. పద్మశ్రీ, భారతరత్న లాంటి అత్యున్నత పురస్కారాలు మదర్ థెరిస్సాకు అందించారు. ఆమె చేసిన సేవలు శాంతి బోధనకు ప్రపంచ అత్యున్నత పురస్కారం నోబెల్ శాంతి బహుమతి ఆమెను వరించింది.