యాప్నగరం

మంత్రిపై హక్కుల తీర్మానం ప్రవేశపెట్టిన రేణుకా చౌదరి

తనను అవమానిస్తూ సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేసిన మంత్రిపై ఫైర్ బ్రాండ్ రేణుకా చౌదరి హక్కుల తీర్మానాన్ని ప్రవేశపెట్టారు.

TNN 9 Feb 2018, 12:30 pm
తనను అవమానిస్తూ సోషల్ మీడియాలో వీడియోను షేర్ చేసిన కేంద్ర మంత్రి కిరణ్ రిజీజుపై కాంగ్రెస్ ఎంపీ రేణుకా చౌదరి హక్కుల తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. రాజ్యసభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలుపుతూ ప్రధాని మోదీ ప్రసంగిస్తున్న సమయంలో రేణుక బిగ్గరగా నవ్వారు. ఆమె అలా నవ్వడం పట్ల ప్రధాని స్పందిస్తూ.. ఆమెను నవ్వనీయండి. రామాయాణం సీరియల్ తర్వాత మళ్లీ ఇన్నాళ్లకు ఇంతలా నవ్వడాన్ని చూసే భాగ్యం దక్కిందంటూ వెటకారంగా మాట్లాడారు.
Samayam Telugu renuka chowdhury moves privilege notice against kiren rijiju for ramayana post
మంత్రిపై హక్కుల తీర్మానం ప్రవేశపెట్టిన రేణుకా చౌదరి


రాజ్యసభలో రేణుక నవ్వుపై మోదీ మాటలను ప్రస్తావిస్తూ, రామాయణం సీరియల్‌లోని శూర్పణక నవ్వుతున్న వీడియోను కిరణ్ రిజిజు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. విమర్శలు రావడంతో అనంతరం దాన్ని తొలగించారు. మంత్రి పోస్టు పట్ల రేణుక అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇది ఓ మహిళను అవమానించడమే, దీనిపై హక్కుల తీర్మానం ప్రవేశపెట్టబోతున్నాను అని ఫైర్ బ్రాండ్‌గా ముద్ర పడిన రేణుక తెలిపారు. ఈ విషయమై ప్రధాని క్షమాపణలు చెప్పాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది.

రామాయణంలో ఏ పాత్రతోనూ పోలిక పెడుతున్నట్లు మోదీ చెప్పనప్పటికీ.. రేణుకను శూర్పణకతో పోలుస్తూ.. సోషల్ మీడియాలో పోస్టులు వెల్లువలా వచ్చాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.