యాప్నగరం

మీ మిఠాయిలు తీసుకోం: పాక్‌తో బీఎస్ఎఫ్ జవాన్లు

దీపావళి, దసరా, రంజాన్ లాంటి పండుగలు, స్వాతంత్ర దినోత్సవాల సందర్భంగా సరిహద్దుల్లో భారత్, పాక్ సైనికులు ఒకొరికొకరు శుభాకాంక్షలు తెలుపుకుంటూ, మిఠాయిలు ఇచ్చిపుచ్చుకుంటారు.

TNN 26 Jan 2018, 12:24 pm
దీపావళి, దసరా, రంజాన్ లాంటి పండుగలు, స్వాతంత్ర దినోత్సవాల సందర్భంగా సరిహద్దుల్లో భారత్, పాక్ సైనికులు ఒకొరికొకరు శుభాకాంక్షలు తెలుపుకుంటూ, మిఠాయిలు ఇచ్చిపుచ్చుకుంటారు. ఈ సంప్రదాయం చాలా ఏళ్లుగా కొనసాగుతోంది. అయితే 69 వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా బీఎస్ఎఫ్ జవాన్లు పాకిస్థాన్ సైన్యం నుంచి మిఠాయిలు తీసుకోడానికి నిరాకరించారు. గత కొంతకాలంగా వాస్తవాధీన రేఖ వెంబడి జమ్మూ కశ్మీర్‌లోని అంతర్జాతీయ సరిహద్దుల్లో పాక్ సైన్యం కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ కాల్పులకు తెగబడుతూ సైనికులను, పౌరులను పొట్టనబెట్టుకుంటోంది. దీంతో ఇరు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. పాక్ సైన్యం తీరుకు నిరసనగా గణతంత్ర దినోత్సవ వేడుకల్లో వారు అందజేసే మిఠాయిలను తీసుకోరాదని భారత జవాన్లు ఓ నిర్ణయానికి వచ్చారు.
Samayam Telugu republic day bsf refuses to exchange sweets with pakistani rangers
మీ మిఠాయిలు తీసుకోం: పాక్‌తో బీఎస్ఎఫ్ జవాన్లు


ఈ విషయం గురించి పాక్ రేంజర్లకు గురువారమే తెలియజేశారు. రిపబ్లిక్ డే రోజున ఎలాంటి కార్యక్రమాలు ఉండబోవని తెలిపింది. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తోన్న పాక్ వైఖరిని నిరసిస్తూ ఓ బలమైన సందేశాన్ని ఇచ్చేందుకే ఇలా చేశామని బీఎస్ఎఫ్ అధికారి వ్యాఖ్యానించారు. పంజాబ్ ప్రాంతంలో పాకిస్థాన్‌తో ఉన్న 553 కిలోమీటర్ల అంతర్జాతీయ సరిహద్దుల్లో బీఎస్ఎఫ్ దళాలు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటుచేశాయి. గత నాలుగైదేళ్ల నుంచి కొన్ని సందర్భాల్లో ఇరు దేశాల సైనికులు ఈ సంప్రదాయన్ని కొనసాగించడం లేదు. ముఖ్యంగా అమృత్‌సర్ సమీపంలో అట్టారీ-వాఘా గేట్ దగ్గర మిఠాయిలు ఇచ్చిపుచ్చుకోవడం మాత్రం జరిగేది. ఈసారి మాత్రం అక్కడ కూడా నిలిచిపోయింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.