దేశ వ్యాప్తంగా పెరిగిపోతున్న ఉష్ణోగ్రతలతో దేశంలో జనజీవనం అతలాకుతలం అయిపోతోంది. అడుగుతీసి అడుగు బయటకు పెట్టాలంటేనే జనం భయపడిపోతున్నారు. దేశంలోని మెజారిటీ ప్రాంతాల్లో భానుడు ప్రచండ కిరణాలతో వేడిమంటలు పుడుతున్నాయి. పలు చోట్ల 40 డిగ్రీల కన్నా తక్కువ వేడిమి నమోదుకావడం లేదు. తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇదే పరిస్థితి. కోస్తా ఆంధ్రలో కాస్త వేడి తగ్గినట్లు అనిపించినా, రాయలసీమలో మాత్రం పరిస్థితి అలాగే కొనసాగుతోంది. ఇప్పుడే ఇలా ఉంటే వచ్చే మే నెలలో పరిస్థితి ఎలా ఉంటుందోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
పెరిగిపోతున్న ఉష్ణోగ్రతలు
దేశ వ్యాప్తంగా పెరిగిపోతున్న ఉష్ణోగ్రతలతో దేశంలో జనజీవనం అతలాకుతలం అయిపోతోంది
TNN 27 Apr 2016, 8:50 pm