యాప్నగరం

పెరిగిపోతున్న ఉష్ణోగ్రతలు

దేశ వ్యాప్తంగా పెరిగిపోతున్న ఉష్ణోగ్రతలతో దేశంలో జనజీవనం అతలాకుతలం అయిపోతోంది

TNN 27 Apr 2016, 8:50 pm
దేశ వ్యాప్తంగా పెరిగిపోతున్న ఉష్ణోగ్రతలతో దేశంలో జనజీవనం అతలాకుతలం అయిపోతోంది. అడుగుతీసి అడుగు బయటకు పెట్టాలంటేనే జనం భయపడిపోతున్నారు. దేశంలోని మెజారిటీ ప్రాంతాల్లో భానుడు ప్రచండ కిరణాలతో వేడిమంటలు పుడుతున్నాయి. పలు చోట్ల 40 డిగ్రీల కన్నా తక్కువ వేడిమి నమోదుకావడం లేదు. తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇదే పరిస్థితి. కోస్తా ఆంధ్రలో కాస్త వేడి తగ్గినట్లు అనిపించినా, రాయలసీమలో మాత్రం పరిస్థితి అలాగే కొనసాగుతోంది. ఇప్పుడే ఇలా ఉంటే వచ్చే మే నెలలో పరిస్థితి ఎలా ఉంటుందోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.