యాప్నగరం

లాలూ ప్రసాద్‌కు జేపీ స్కీమ్‌లో పెన్షన్

ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ బిహార్ ప్రభుత్వం నుంచి నెలకు రూ.10000 పెన్షన్ పథకాన్ని ఎంపికయ్యారు.

TNN 12 Jan 2017, 11:23 am
ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ బిహార్ ప్రభుత్వం నుంచి నెలకు రూ.10000 పెన్షన్ పథకాన్ని ఎంపికయ్యారు. లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ్ సేనాని సమ్మాన్ పెన్షన్ పథకం కింద లాలూ ఈ పెన్షన్ అందుకుంటారు.
Samayam Telugu rjd chief lalu gets pension rs 10000 under jp senani samman yojana
లాలూ ప్రసాద్‌కు జేపీ స్కీమ్‌లో పెన్షన్


జేపీ స్మారకార్ధం నితీష్ కుమార్ ప్రభుత్వం 2009లో ఈ పథకాన్ని ప్రారంభించింది. జేపీ అనుచరులుగా ఆయన ప్రారంభించిన సంపూర్ణ క్రాంతి ఉద్యమంలో పాల్గొన్న 3వేల మందికి ఈ పెన్షన్ ఇవ్వాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

సంపూర్ణ క్రాంతి ఉద్యమంలో భాగంగా మార్చి 18, 1974 నుంచి మార్చి 21, 1977ల మధ్యకాలంలో ఆరునెలలపాటు జైలు శిక్ష అనుభవించిన ఉద్యమకారులు ఈ పెన్షన్ కు అర్హులు. లాలూ ప్రసాద్ యాదవ్ విద్యార్థి నేతగా జేపీ అనుచరుడిగా 1974లో జైలు శిక్ష అనుభవించారు.

బిహార్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన జేపీ సేనాని సమ్మాన్ యోజన పథకంలో భాగంగా తనకు రూ.10వేలు పెన్షన్ ఇవ్వాలని లాలూ పెట్టుకున్న దరఖాస్తుకు స్పందించిన హోం శాఖ సానుకూలంగా స్పందించింది. 2009 నుంచి లాలూ ఈ పెన్షన్ కు అర్హులని హోం శాఖ అధికారులు తెలిపారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.