Lalu Prasad Yadav లాలూకు విజయవంతంగా కిడ్నీ మార్పిడి.. క్షేమంగా తండ్రీకూతుళ్లు
Lalu Prasad Yadav సింగ్పూర్లో స్థిరపడిన లాలూ కుమార్తె రోహిణి ఆచార్య తన కిడ్నీకి డొనేట్ చేసేందుకు ఇటీవల ముందుకు వచ్చి అందరి ప్రశంసలు అందుకున్నారు. ఆయన ఎందరికో ఆదర్శమని, తండ్రి కోసం తాను ఏది చేయడానికైనా సిద్ధమేనని ఆమె ప్రకటించారు. ఢిల్లీ ఎయిమ్స్లో కొన్నాళ్లు లాలూ చికిత్స తీసుకోగా.. అక్కడి వైద్యులు మాత్రం కిడ్నీ మార్పిడి చికిత్స గురించి సూచించలేదు. సింగ్పూర్లో లాలూకు కుమార్తె వైద్య పరీక్షలు చేయించడంతో వైద్యుల సూచనతో కిడ్నీ మార్పిడి జరిగింది.
ప్రధానాంశాలు:
- అనారోగ్యంతో బెయిల్పై బయటకు లాలూ
- సింగ్పూర్లో కిడ్నీ మార్పిడి చికిత్సకు అనుమతి
- ముందుకొచ్చిన రెండో కుమార్తె రోహిణి ఆచార్య
Lalu Prasad Yadav బిహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్కు మూత్రపిండ మార్పిడి శస్త్రచికిత్స విజయవంతమైంది. లాలూ కుమార్తె రోహిణి అర్చన కిడ్నీని దానం చేయగా.. సింగపూర్లోని మౌంట్ ఎలిజబెత్ ఆసుపత్రిలో సోమవారం శస్త్రచికిత్స ద్వారా అమర్చారు. ప్రస్తుతం వారిద్దరూ ఆరోగ్యంగా ఉన్నారని లాలూ కుమారుడు, బిహార్ డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్ తెలిపారు. లాలూ ప్రసాద్ యాదవ్ను ఆపరేషన్ థియేటర్ నుంచి ఐసీయూకు తరలిస్తున్న వీడియో ట్వీట్ చేసిన ఆయన.. తమ కోసం ప్రార్థించిన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. ‘‘కిడ్నీ శస్త్రచికిత్స విజయవంతంగా జరిగిన అనంతరం నాన్నగారిని ఆపరేషన్ థియేటర్ నుంచి ఐసీయూకు మార్చారు... కిడ్నీ ఇచ్చిన అక్కతో పాటు మా జాతీయ అధ్యక్షుడు (లాలూ) క్షేమంగా ఉన్నారు.. వారి క్షేమం కోరుతూ ప్రార్థనలు చేసిన అందరికీ కృతజ్ఞతలు’’ అని తేజస్వి అన్నారు. అటు, లాలూ శస్త్రచికిత్స విజయవంతమై, త్వరగా కోలుకోవాలని కోరుకుంటూ బీహార్లోని పలు ప్రాంతాల్లో ఆయన అభిమానులు ప్రార్థనలు, ప్రత్యేక పూజలు చేశారు. పాట్నాలోని ఆలయాల్లో సామూహిక ప్రార్థనలు నిర్వహించారు.
గత కొన్నాళ్లుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న లాలూ ప్రసాద్ యాదవ్కు సింగ్పూర్ వైద్యులు కిడ్నీ మార్పిడి అనివార్యమని సూచించారు. దీంతో తన కిడ్నీని ఇవ్వడానికి సింగపూర్లో ఉంటున్న లాలూ రెండో కుమార్తె రోహిణి ముందుకొచ్చారు. ‘నా తల్లిదండ్రులే నాకు దేవుళ్లు. వారికోసం ఏదైనా చేస్తా’ అంటూ చెప్పిన ఆమె.. కిడ్నీ అనేది తన శరీరంలోని ఓ చిన్న ముక్క మాత్రమే అని అన్నారు. సోమవారం సర్జరీ జరిగే కొద్ది నిమిషాల ముందు ఇదే విషయాన్ని గుర్తు చేస్తూ తమకు గుడ్లక్ చెప్పండంటూ లాలూతో ఉన్న ఓ ఫొటోను ట్విట్టర్లో పోస్టు చేశారు.
దాణా కుంభకోణం కేసుల్లో శిక్ష అనుభవిస్తున్న లాలూ.. అనారోగ్య కారణాలతో ఆయన బెయిల్పై బయటకు వచ్చారు. కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స కోసం సింగపూర్కు వెళ్లేందుకు కోర్టు అనుమతి పొందిన ఆయన.. కుమార్తె కిడ్నీ దానంతో శస్త్రచికిత్స జరిగింది.
Read Latest National News And Telugu News
గత కొన్నాళ్లుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న లాలూ ప్రసాద్ యాదవ్కు సింగ్పూర్ వైద్యులు కిడ్నీ మార్పిడి అనివార్యమని సూచించారు. దీంతో తన కిడ్నీని ఇవ్వడానికి సింగపూర్లో ఉంటున్న లాలూ రెండో కుమార్తె రోహిణి ముందుకొచ్చారు. ‘నా తల్లిదండ్రులే నాకు దేవుళ్లు. వారికోసం ఏదైనా చేస్తా’ అంటూ చెప్పిన ఆమె.. కిడ్నీ అనేది తన శరీరంలోని ఓ చిన్న ముక్క మాత్రమే అని అన్నారు. సోమవారం సర్జరీ జరిగే కొద్ది నిమిషాల ముందు ఇదే విషయాన్ని గుర్తు చేస్తూ తమకు గుడ్లక్ చెప్పండంటూ లాలూతో ఉన్న ఓ ఫొటోను ట్విట్టర్లో పోస్టు చేశారు.
దాణా కుంభకోణం కేసుల్లో శిక్ష అనుభవిస్తున్న లాలూ.. అనారోగ్య కారణాలతో ఆయన బెయిల్పై బయటకు వచ్చారు. కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స కోసం సింగపూర్కు వెళ్లేందుకు కోర్టు అనుమతి పొందిన ఆయన.. కుమార్తె కిడ్నీ దానంతో శస్త్రచికిత్స జరిగింది.
Read Latest National News And Telugu News