యాప్నగరం

ప్రత్యర్థులకు సవాల్: పన్నీరు సెల్వం అభ్యర్థి రెడీ!

ఆర్కే నగర్ నియోజకవర్గం నుంచినే గతంలో ఒకసారి ఎమ్మెల్యేగా కూడా పనిచేశారీయన. పన్నీరుని శశి పదవి నుంచి తొలగించినప్పుడు..

TNN 17 Mar 2017, 2:35 pm
తమిళ రాజకీయాల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్న ఆర్కే నగర్ నుంచి తన తరపు అభ్యర్థిని ప్రకటించేశాడు తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం. తమదే అసలైన అన్నాడీఎంకే అని వాదిస్తున్న పన్నీరు ఇక్కడ నుంచి మధుసూదనన్ ను అభ్యర్థిగా ప్రకటించాడు. ఇప్పటికే ఈ నియోజకవర్గం నుంచి జయలలిత మేనకోడలు దీపా, శశికళ అక్క కొడుకు టీటీవీ దినకరన్ లు పోటీకి రెడీ అని ప్రకటించేశారు.
Samayam Telugu rk nagar by poll
ప్రత్యర్థులకు సవాల్: పన్నీరు సెల్వం అభ్యర్థి రెడీ!


వారు పోటీ చేయడం దాదాపు ఖరారు అయ్యింది. తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత ప్రాతినిధ్యం వహించిన ఈ నియోజకవర్గం నుంచి తమ అభ్యర్థి పోటీలో ఉంటాడని పన్నీరు చెబుతూ వచ్చారు. తాజాగా మధుసూదనన్ విషయంలో ప్రకటన కూడా చేశారు. ఈ సందర్భంగా మధుసూదనన్ మాట్లాడుతూ.. తమ విజయం తథ్యం అని అన్నారు.

ఎంజీఆర్ సమయం నుంచి అన్నాడీఎంకేలో పనిచేశారు మధుసూదనన్. ఎంజీఆర్ అనంతరం జయలలితకు నమ్మిన మనిషి అయ్యాడు. అన్నాడీఎంకేలో ప్రముఖ నేతగా చలామణి అయ్యారు. అంతే కాదు.. ఆర్కే నగర్ నియోజకవర్గం నుంచినే గతంలో ఒకసారి ఎమ్మెల్యేగా కూడా పనిచేశారీయన. జయలలిత మరణానంతరం పన్నీరుని శశి పదవి నుంచి తొలగించినప్పుడు.. ఆయనతో పాటు బయటకు వచ్చాడు. ఈ నియోజకవర్గంపై పట్టున్న నేతగా గుర్తింపు ఉన్న మధుసూదనన్ రంగంలోకి దిగడంతో ఈ ఉప ఎన్నిక మరింత ఆసక్తికరంగా మారింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.