సెంట్రల్ యూనివర్సిటీలో ఆత్మహత్య చేసుకున్న రోహిత్ వేముల ఘటన దేశాన్ని ఎంతలా కుదిపేసిందో అందరికీ తెలిసిందే. ఆత్మహత్యకు దారితీసిన పరిస్థితులపై దర్యాప్తు చేయాల్సిందిగా కేంద్రం జస్టిస్ రూపన్ వాల్ నేతృత్వంలో కమిషన్ ను ఏర్పాటు చేసింది. ఆ కమిషన్ తాజాగా తన నివేదికను కేంద్ర మానవ వనరుల శాఖకు అందజేసింది. ఆ నివేదికలో రోహిత్ దళితుడు అని చెప్పడానికి ఎలాంటి అధికారిక పత్రాలు లేవని పేర్కొంది. అతని తల్లి రాధికను పెంచిన తల్లిదండ్రులు ఆమె అసలు తల్లిదండ్రుల పేర్లు చెప్పలేదని, అలాంటప్పుడు వారు ఏ కులస్థులో చెప్పలేరని పేర్కొంది. రోహిత్ కు ఎస్సీ సర్టిఫికెట్ ఇప్పించేందుకే రాధిక ఎస్సీ అని చెప్పి ఉంటారని అభిప్రాయపడింది.
ఇక రోహిత్ ఆత్మహత్య విషయానికి వస్తే... పూర్తిగా తన వ్యక్తిగత కారణాల వల్ల రోహిత్ ఆత్మహత్య చేసుకున్నాడని కమిషన్ తేల్చింది. అతని ఆత్మహత్యకు, కేంద్రమంత్రులు స్మృతి ఇరానీ, బండారు దత్తాత్రేయలకు ఎలాంటి సంబంధం లేదని తెలిపారు. యూనివర్సిటీ అధికారులకు కూడా ఎలాంటి పాత్ర లేదని తేల్చింది.
రోహిత్ వేముల ఈ ఏడాది జనవరి 28న సెంట్రల్ యూనివర్సిటీలో తన గదిలోనే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
ఇక రోహిత్ ఆత్మహత్య విషయానికి వస్తే... పూర్తిగా తన వ్యక్తిగత కారణాల వల్ల రోహిత్ ఆత్మహత్య చేసుకున్నాడని కమిషన్ తేల్చింది. అతని ఆత్మహత్యకు, కేంద్రమంత్రులు స్మృతి ఇరానీ, బండారు దత్తాత్రేయలకు ఎలాంటి సంబంధం లేదని తెలిపారు. యూనివర్సిటీ అధికారులకు కూడా ఎలాంటి పాత్ర లేదని తేల్చింది.
రోహిత్ వేముల ఈ ఏడాది జనవరి 28న సెంట్రల్ యూనివర్సిటీలో తన గదిలోనే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.