యాప్నగరం

కన్నుల పండుగగా యువరాజు పెళ్లి

మైసూరు మహారాజు యధువీర్ కృష్ణదత్త పెళ్లి మహోత్సవం కన్నులపండువగా సాగింది.

TNN 27 Jun 2016, 10:25 am
మైసూరు మహారాజు యధువీర్ కృష్ణదత్త పెళ్లి మహోత్సవం కన్నులపండువగా సాగింది. సోమవారం ఉదయం 9.05 నుంచి 9.35 గంటల నడుమ కర్కాటక లగ్నంలో ఆయన వివాహం యువరాణి త్రిషికా కుమారితో జరిగింది. రాజస్థాన్‌లోని దుంగార్ పూర్ యువరాణి త్రిషికా కుమారి. శనివారం నుంచే వీరి వివాహ మహోత్సవ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. హోహాలు, గణపతి పూజ, యజ్ఞోపవీత ధారణ, ఇతరపూజలు, కాశీ యాత్ర నిర్వహించారు. శనివారం రాత్రే యువరాణి త్రిషికా కుమారి మైసూర్ ప్రాసాదానికి చేరుకుంది. ఇందుకోసం మైసూరులోని అంబా ప్యాలెస్ సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. దాదాపు వెయ్యిమంది దాకా అతిధులు హాజరయ్యారు. రాజమాత ప్రమోద దేవి చేతుల మీదుగా దత్త పుత్రుడి వివాహం ఘనంగా జరిగింది. తమకు పిల్లలు లేని కారణంగా ప్రమోదా దేవి, భర్త నరసింహ రాజ ఒడెయారు తరుపు బంధువైన యధువీర్ ను దత్తత తీసుకుని రాజుగా పట్టాభాషిక్తున్ని చేశారు. జూన్ 28న మైసూరులో, జూలై 2న బెంగళూరులో భారీ రిసెప్షన్ ఏర్పాటు చేశారు.
Samayam Telugu royal wedding
కన్నుల పండుగగా యువరాజు పెళ్లి



తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.