యాప్నగరం

వెయ్యి, 500 నోట్లు రద్దు చేసిన మోడీ సర్కార్ !

బ్లాక్ మనీని నిరోధించేందుకు ప్రధాని మోడీ సంచలన నిర్ణయం తీసుకున్నారు.

TNN 8 Nov 2016, 9:01 pm
బ్లాక్ మనీని నిరోధించేందుకు మోడీ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ చర్యలో భాగంగా రూ.1000, రూ. 500 నోట్లు రద్దు చేస్తున్నట్లు ప్రధాని మోడీ ప్రకటించారు. ఈ రోజు అర్థరాత్రి నుంచి రద్దు అమల్లోకి వస్తుందని వెల్లడించారు. ప్రధాని మోడీ ఈ రోజు ఢిల్లీలో జాతీనుద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన ఇలాంటి సంచలన ప్రకటన చేశారు. అయితే ఈ విషయంలో ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. డిసెంబర్ 31 లోపు బ్యాంకులు,ఫోస్టాఫిసుల్లో నోట్లు జమ చేసుకోవచ్చని తెలిపారు. అయితే డబ్బులు జమ చేసే సమయంలోఆధార్ లాంటి గుర్తింపు కార్టులను తప్పనిసరిగా చూపించాల్సిన అవసరముందని ప్రధాని మోడీ వెల్లడించారు.
Samayam Telugu rs 100 rs 500 baned by modi govt
వెయ్యి, 500 నోట్లు రద్దు చేసిన మోడీ సర్కార్ !


దేశ అభివృద్ధికి ఉగ్రవాదం ఆటంకంగా మారిందని ప్రధాని మోడీ అన్నారు. ఉగ్రవాదులకు నల్లధనం ప్రధాన ఆదాయ వనరుగా మారిందని.. ప్రధానంగా బ్లాక్ మనీ రూ.1000, రూ.500 నోట్ల రూపంలో ఉన్నాయని .. అందుకే వాటిని రద్దు చేస్తున్నట్లు ప్రధాని మోడీ వెల్లడించారు. ఉగ్రవాదాన్ని అణచివేసుందకే ఇలాంటి సంచలన నిర్ణయం తీసుకుంటున్నామని ప్రధాని ప్రకటించారు. ఈ చర్యలకు ప్రజలు సహకరించాలని ప్రధాని మోడీ కోరారు. ఈ సందర్బంగా మోడీ మాట్లాడుతూ నవంబరు 9, 10 న ఏటీఎంలు బంద్ చేస్తున్నట్లు ప్రకటించారు. బ్యాంకులు కూడా రేపు పనిచేయబోమని తెలిపారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.