యాప్నగరం

ఎమ్మెల్యే ఇంట్లో రూ.120 కోట్ల అక్రమాస్తులు!

లెక్కకు మించి అక్రమాస్తులను కూడబెట్టిన ఓ కాంగ్రెస్ ఎమ్మెల్యే అడ్డంగా దొరికిపోయారు.

TNN 12 Feb 2017, 10:33 am
లెక్కకు మించి అక్రమాస్తులను కూడబెట్టిన ఓ కాంగ్రెస్ ఎమ్మెల్యే అడ్డంగా దొరికిపోయారు. కర్ణాటకలో ఓ ఎమ్మెల్యే ఇంటిపై దాడిచేసిన ఆదాయ పన్ను శాఖ అధికారులు రూ.120 కోట్ల అక్రమాస్తులకు సంబంధించిన పత్రాలు, రూ.1.10 కోట్ల నగదు, 10 కేజీల బంగారం స్వాధీనం చేసుకున్నారు. అయితే మూడు రోజుల క్రితం జరిగిన ఈ ఘటన తాజాగా బయటికొచ్చింది.
Samayam Telugu rs 120 crore hidden income rs 1 10 crore cash detected in i t raids on karnataka congress mla
ఎమ్మెల్యే ఇంట్లో రూ.120 కోట్ల అక్రమాస్తులు!


కర్ణాటకలోని హోస్కోట్ నియోజవర్గ ఎమ్మెల్యే ఎంటీబీ నాగరాజు ఇంటిపై ఐటీ అధికారులు గురువారం దాడి చేసారు. నాగరాజుతో పాటు ఇంకొంత మంది ఆయన బంధువులపై ట్యాక్స్ ఎగ్గొట్టేరని ఆరోపణలు రావడంతో ఆదాయ పన్ను శాఖ తాజా దాడులకు దిగింది. ఈ దాడుల్లో 560 ఎకరాల భూమికి సంబంధించిన 3,500 పత్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ భూములన్నీ నాగరాజు, అతని బినామీల పేరుతో రిజిస్టర్ అయి ఉన్నట్లు అధికారులు గుర్తించారు.

నాగరాజు ఇంట్లో దొరికిన సొమ్మే కాకుండా అని బినామీలు, బంధువుల ఇళ్లలో కూడా ఐటీ అధికారులు పెద్ద మొత్తంలో నగదు స్వాధీనం చేసుకున్నారు. ఎమ్మెల్యేతో సంబంధమున్న వారి వద్ద నుంచి రూ. 70 కోట్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.