యాప్నగరం

పాక్ సైనికుల తల నరికి తెస్తే రూ. 5 కోట్లు: ముస్లిం సంస్థ

పాక్ సైనికుల తల నరికి తెస్తే, రూ. 5 కోట్లు ఇస్తాం.. అంటూ ఓ ముస్లిం సంస్థ సంచలన ప్రకటన చేసింది.

TNN 9 May 2017, 12:55 pm
పాక్ సైనికుల తల నరికి తెస్తే, రూ. 5 కోట్లు ఇస్తాం.. అంటూ ఓ ముస్లిం సంస్థ సంచలన ప్రకటన చేసింది. ‘ముస్లిం యువ ఆతంక్‌వాద్ విరోధి సమితి’ సంస్థ అధ్యక్షుడు మొహమ్మద్ షకీల్ సైఫీ ఈ మేరకు ప్రకటించారు. సోమవారం ఆయన అజ్మీర్ దర్గా సందర్శనకు వచ్చారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ.. ‘ఎవరైనా పాక్ సైనికుల తల నరికి తెచ్చి, భారత్‌కు అప్పగిస్తే.. అతడికి రూ. 5 కోట్లు అందజేస్తాం. ఈ మొత్తాన్ని మా సంస్థ వలంటీర్లు, ప్రజల నుంచి విరాళాల రూపంలో సేకరిస్తాం’ అని ఆయన ప్రకటించారు.
Samayam Telugu rs 5 crore reward for those beheading pak soldiers muslim organisation announces
పాక్ సైనికుల తల నరికి తెస్తే రూ. 5 కోట్లు: ముస్లిం సంస్థ


ఇటీవల భారత సరిహద్దు వద్ద పాక్ సైనికులు దుశ్చర్యకు పాల్పడిన విషయం తెలిసిందే. పాకిస్థాన్ సరిహద్దు వద్ద విధులు నిర్వహిస్తున్న భారత జవాన్లపై ఒక్కసారిగా విరుచుకుపడి, వారిని హతమార్చారు. అంతటితో ఆగకుండా మన జవాన్ల శరీరాన్ని ముక్కలు ముక్కలుగా నరికేశారు. దీంతో పాక్‌పై దేశవ్యాప్తంగా ఆగ్రహ జ్వాలలు పెల్లుబుకుతున్నాయి. ఈ నేపథ్యంలో ఒక ముస్లిం సంస్థకు అధినేతగా ఉన్న షకీల్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.