యాప్నగరం

తిరుమలేశుడిపై అనుచిత వ్యాఖ్యలు.. ఆర్టీఐ కార్యకర్త అరెస్ట్

వెంకటేశ్వర స్వామిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఎన్.నర్సింహ మూర్తి అనే ఆర్టీఐ కార్యకర్తను యలహంక పోలీసులు అరెస్ట్ చేశారు.

TNN 25 Jul 2018, 1:26 pm
బెంగళూరు: వెంకటేశ్వర స్వామిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఎన్.నర్సింహ మూర్తి అనే ఆర్టీఐ కార్యకర్తను యలహంక పోలీసులు అరెస్ట్ చేశారు. ఏప్రిల్ 27న సాయంత్రం 7.30 గంటల సమయంలో నిర్వహించిన ఓ టీవీ ఛానెల్ చర్చ సందర్భంగా వెంకటేశ్వర స్వామిపై తిరు నామాన్ని కించపరిచేలా నర్సింహ వ్యాఖ్యలు చేశారు. దీంతో అతణ్ని అరెస్ట్ చేసిన పోలీసులు బెంగళూరు హైకోర్టు ముందు హాజరుపరిచారు.
Samayam Telugu tirumala1.


బీఎం సురేష్ అనే వ్యక్తి ఫిర్యాదు మేరకు ఐపీసీ సెక్షన్లు 295ఎ, 298 ప్రకారం నర్సింహ మూర్తిపై కేసు నమోదు చేశారు. తాను ఫిర్యాదు చేసిన తర్వాత నర్సింహ మూర్తిపై చర్యలు తీసుకోవడానికి బదులు.. స్టూడియో నుంచి అతడు బయటకు వెళ్లడానికి పోలీసులు రక్షణ కల్పించారని సురేశ్ ఆరోపించారు. పోలీస్ కమిషన్‌కు సమాచారం ఇచ్చినప్పటికీ.. ఫలితం లేకపోయిందన్నారు. మూడు నెలల క్రితం ఫిర్యాదు చేసినప్పటికీ పోలీసులు కేసు నమోదు చేయకపోవడాన్ని జస్టిస్ అరవింద్ కుమార్ తప్పుబట్టారు. ఈ ఘటనతో ప్రమేయం ఉన్న పోలీసులను ఆయన హెచ్చరించారు.

Read This Story in Kannada

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.