సుప్రీంకోర్టు తీర్పు అమలు సాధ్యాసాధ్యాలపై చర్చించేందుకు పందళ రాజ కుటుంబం, అయ్యప్ప ఆలయ ప్రధాన పూజారితో ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు మంగళవారం నిర్వహించిన సమావేశం అర్థాంతరంగా ముగిసింది. వారితో జరిపిన చర్చలు విఫలమయ్యాయి. దీనిపై పందళ రాజ వంశీయుడు శశికుమార్ వర్మ మాట్లాడుతూ... రివ్యూ పిటిషన్పై అక్టోబరు 19న చర్చిస్తామని దేవస్థానం బోర్డు పేర్కొనడం తమను తీవ్ర నిరాశకు గురిచేసిందని అన్నారు. సమావేశం సంతృప్తికరంగా సాగలేదని, తమ డిమాండ్లను వారు అంగీకరించడానికి సిద్ధంగా లేరని ఆయన పేర్కొన్నారు. శతాబ్దాలుగా కొనసాగుతోన్న సంప్రదాయానికి విఘాతం కలిగించవద్దని, రివ్యూ పిటిషన్ వేసేలా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని పందళరాజు శశికుమార్ వర్మ, శబరిమల ఆలయ ప్రధాని పూజరి కందరారు మహేశ్వరారు డిమాండ్ చేశారు. అయితే వీటిని టీబీడీ పట్టించుకోలేదని వారు తెలియజేశారు.
మరోవైపు, సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ వేయబోమని, మహిళలను రాకుండా ఎవరూ అడ్డుకోలేరని ముఖ్యమంత్రి పినరయ్ విజయన్ మంగళవారం ఉదయం ప్రకటించారు. శాంతి భద్రతలను ఎవరూ తమచేతుల్లోకి తీసుకోలేరు.. శబరిమల ఆలయానికి వచ్చే భక్తులకు ప్రభుత్వం అన్ని సదుపాయాలు కల్పిస్తుంది.. రివ్యూ పిటిషన్ వేసే ప్రసక్తేలేదు, న్యాయస్థానం చెప్పిన విధంగా నడుచుకుంటామని సీఎం వ్యాఖ్యానించారు. వారం వారం నిర్వహించే క్యాబినెట్ సమావేశం అనంతరం సీఎం ఈ వ్యాఖ్యలు చేశారు. పందళ రాజు, తంత్రీలతో దేవస్థానం బోర్డు సమావేశం ప్రారంభానికి కొద్దిసేపటి ముందు విజయన్ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
కాగా, సర్వోన్నత న్యాయస్థానం తీర్పు ప్రకారం మహిళలు ఆలయంలో ప్రవేశించడానికి ప్రయత్నిస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హిందూ సంఘాలు హెచ్చరిస్తున్నాయి. ఇలాంటి ఉద్రిక్తతల నడుమే నెలవారీ పూజల కోసం శబరిమల ఆలయం బుధవారం తెరుచుకోనుంది. ఈ నేపధ్యంలో, మహిళలను శబరిమలలో ప్రవేశించకుండా అడ్డుకునేందుకు భారీ సంఖ్యలో మహిళా నిరసనకారులు నిలక్కల్కు చేరుకున్నారు. మహిళలను ఆలయంలోకి అనుమతిస్తే ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరించారు. వాహనాలను తనిఖీచేస్తూ మహిళలు ఉంటే వారిని వెనక్కు వెళ్లిపోవాలని సూచిస్తున్నారు. ఈ ప్రదేశంలోనే పోలీసులను కూడా భారీ సంఖ్యలో మొహరించారు.
ఆందోళనకారులు ప్రయివేట్ వాహనాలు, ప్రభుత్వ బస్సులను సైతం అడ్డుకుని మహిళలను వెనక్కు పంపుతున్నారు. బెంగళూరుకు చెందిన విద్యార్థుల బృందం కూడా ఇలాగే వెనుదిరిగింది. అలాగే శబరిమలలో మీడియా కవరేజ్కు వచ్చిన మహిళ జర్నలిస్ట్లను సైతం బేస్ క్యాంప్ వద్ద నిలిపేశారు. ఓ మహిళ భక్తురాలు ఆత్మహత్యాయత్నం చేయగా, దాన్ని పోలీసులు భగ్నం చేశారు. ఈ నేపథ్యంలో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
మరోవైపు, సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ వేయబోమని, మహిళలను రాకుండా ఎవరూ అడ్డుకోలేరని ముఖ్యమంత్రి పినరయ్ విజయన్ మంగళవారం ఉదయం ప్రకటించారు. శాంతి భద్రతలను ఎవరూ తమచేతుల్లోకి తీసుకోలేరు.. శబరిమల ఆలయానికి వచ్చే భక్తులకు ప్రభుత్వం అన్ని సదుపాయాలు కల్పిస్తుంది.. రివ్యూ పిటిషన్ వేసే ప్రసక్తేలేదు, న్యాయస్థానం చెప్పిన విధంగా నడుచుకుంటామని సీఎం వ్యాఖ్యానించారు. వారం వారం నిర్వహించే క్యాబినెట్ సమావేశం అనంతరం సీఎం ఈ వ్యాఖ్యలు చేశారు. పందళ రాజు, తంత్రీలతో దేవస్థానం బోర్డు సమావేశం ప్రారంభానికి కొద్దిసేపటి ముందు విజయన్ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
కాగా, సర్వోన్నత న్యాయస్థానం తీర్పు ప్రకారం మహిళలు ఆలయంలో ప్రవేశించడానికి ప్రయత్నిస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హిందూ సంఘాలు హెచ్చరిస్తున్నాయి. ఇలాంటి ఉద్రిక్తతల నడుమే నెలవారీ పూజల కోసం శబరిమల ఆలయం బుధవారం తెరుచుకోనుంది. ఈ నేపధ్యంలో, మహిళలను శబరిమలలో ప్రవేశించకుండా అడ్డుకునేందుకు భారీ సంఖ్యలో మహిళా నిరసనకారులు నిలక్కల్కు చేరుకున్నారు. మహిళలను ఆలయంలోకి అనుమతిస్తే ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరించారు. వాహనాలను తనిఖీచేస్తూ మహిళలు ఉంటే వారిని వెనక్కు వెళ్లిపోవాలని సూచిస్తున్నారు. ఈ ప్రదేశంలోనే పోలీసులను కూడా భారీ సంఖ్యలో మొహరించారు.
ఆందోళనకారులు ప్రయివేట్ వాహనాలు, ప్రభుత్వ బస్సులను సైతం అడ్డుకుని మహిళలను వెనక్కు పంపుతున్నారు. బెంగళూరుకు చెందిన విద్యార్థుల బృందం కూడా ఇలాగే వెనుదిరిగింది. అలాగే శబరిమలలో మీడియా కవరేజ్కు వచ్చిన మహిళ జర్నలిస్ట్లను సైతం బేస్ క్యాంప్ వద్ద నిలిపేశారు. ఓ మహిళ భక్తురాలు ఆత్మహత్యాయత్నం చేయగా, దాన్ని పోలీసులు భగ్నం చేశారు. ఈ నేపథ్యంలో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.