యాప్నగరం

రాజస్థాన్ సంక్షోభం: హైకోర్టుకు అసమ్మతి నేతలు.. మరోసారి తెరపైకి స్పీకర్ అధికారాలు

Rajasthan Crisis రోజుకో మలుపు తిరుగుతోంది. సీఎల్పీ సమావేశానికి హాజరుకాలేదనే కారణంతో నోటీసులు జారీచేసిన స్పీకర్.. మూడు రోజుల్లోగా సమాధానం ఇవ్వకపోతే అనర్హత వేటువేస్తామని హెచ్చరించడంపై అసమ్మతి ఎమ్మెల్యేలు కోర్టును ఆశ్రయించారు.

Samayam Telugu 16 Jul 2020, 3:26 pm
రాజస్థాన్‌లో ఏర్పడిన రాజకీయ సంక్షోభంతో మరోసారి ఎమ్మెల్యే అనర్హత విషయంలో స్పీకర్ అధికారాలపై చర్చ జరుగుతోంది. శాసనసభా పక్షం సమావేశానికి గైర్హాజరైన సచిన్ పైలట్ సహా 19 మంది ఎమ్మెల్యేలకు నోటీసులు జారీచేసిన స్పీకర్.. మూడు రోజుల్లోగా దీనికి సమాధానం చెప్పకపోతే అనర్హత వేటు వేస్తామని పేర్కొన్నారు. దీంతో పైలట్ వర్గం ఎమ్మెల్యేలు రాజస్థాన్ హైకోర్టును ఆశ్రయించారు. కేవలం అసెంబ్లీ సమావేశాల్లోనే విప్ వర్తిస్తుందని వాదిస్తున్నారు. సచిన్ వర్గానికి చెందిన ఎమ్మెల్యే పృథ్వీరాజ్ మీనా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా.. ఆయన తరఫున సీనియర్ న్యాయవాదులు హరీశ్ సాల్వే, ముకుల్ రోహిత్గీలు హాజరయ్యారు.
Samayam Telugu రాజస్థాన్ రాజకీయ సంక్షోభం
Rajasthan Political Crisis


అటు, రాజస్థాన్ స్పీకర్ తరఫున కాంగ్రెస్ నేత, సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ వాదనలు వినిపించనున్నారు. గురువారం మధ్యాహ్నం 3.00 గంటలకు ఈ పిటిషన్లపై హైకోర్టులో వాదనలు ప్రారంభమయ్యాయి. రాజ్యాంగంలోని పదో షెడ్యూల్‌లోని 2(1) (ఎ) పేరా కింద పైలట్, ఇతర అసమ్మతివాదులపై నోటీసులు ఇచ్చినట్టు స్పీకర్ పేర్కొన్నారు. పైలట్ క్యాంప్ పిటిషన్‌లో సాంకేతిక సమస్యల కారణంగా సవరణలు చేయడానికి సమయం కోరినట్టు తెలుస్తోంది.

గతంలో స్పీకర్ల అధికారాలపై తీర్పులు వెలువరించిన సుప్రీంకోర్టు.. ఈ విషయంలో జోక్యం చేసుకోవడానికి నిరాకరించింది. స్పీకర్ పాత్ర, రాజ్యాంగంలోని 10 వ షెడ్యూల్ ప్రకారం చట్టసభ సభ్యులను అనర్హులుగా ప్రకటించడం వరకు అనేక అంశాలపై సర్వోన్నత న్యాయస్థానం కీలక ఆదేశాలు ఇచ్చింది. కర్ణాటక కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన 2011 తీర్పు రాజస్థాన్ అసెంబ్లీ స్పీకర్ సీపీ జోషి షో జారీచేసిన నోటీసు విషయంలో పైలట్ సహా 19 మంది ఎమ్మెల్యేల కేసును బలపరుస్తుంది. అప్పటి ముఖ్యమంత్రి యడియూరప్ప 11 మంది బీజేపీ ఎమ్మెల్యేల అనర్హతను హైకోర్టు ఆమోదించింది.

ఇక, 2019లో కర్ణాటక కాంగ్రెస్,జేడీఎస్ పార్టీలకు చెందిన 17మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటును సుప్రీంకోర్టు సమర్థించింది. అప్పటి స్పీకర్ రమేశ్ కుమార్ తీసుకున్న అనర్హత వేటును సమర్ధించిన కోర్టు.. అదే సమయంలో వీరు ఉపఎన్నికల్లో పోటీ చేయవచ్చునని కోర్టు తీర్పునిచ్చింది. అనర్హత వేటు వేసే అధికారం స్పీకర్‌కు ఉంటుందని చెప్పింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.