యాప్నగరం

విషమంగా ములాయం సింగ్ యాదవ్ ఆరోగ్యం

రాజకీయ నిపుణుడు, సీనియర్ నేత ములాయం సింగ్ యాదవ్ (Mulayam Singh Yadav)ఆరోగ్య పరిస్థితి ఇంకా విషమంగానే ఉందని డాక్టర్లు వెల్లడించారు. కండిషన్‌లో ఎటువంటి మార్పు లేదని తెలియజేశారు. కొన్ని వారాలుగా ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కానీ ఆయన ఆరోగ్యం మెరుగుపడలేదని తెలుస్తుంది. ఈ మేరకు సమాజ్ వాదీ పార్టీ నేతలు ఆయన కోసం ప్రార్థనలు చేస్తున్నారు. కాగా ములాయం సింగ్ యాదవ్ అనేక పదవీ బాధ్యతలను నిర్వర్తించారు. సమాజ్ వాదీ పార్టీ స్థాపించి ఎన్నో విజయాలను అందుకున్నారు.

Authored byAndaluri Veni | Samayam Telugu 4 Oct 2022, 4:53 pm
సమాజ్ వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్ (82) (Mulayam Singh Yadav) ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉందని డాక్టర్లు వెల్లడించారు. కొన్ని వారాలుగా ఆయన ఆస్పత్రిలోనే ఉన్నారు. పలు ఆరోగ్య సమస్యలకు ఆయన చికిత్స తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ములాయం సింగ్ పరిస్థితి మరింత కష్టంగా ఉందని వైద్యులు బులిటెన్‌లో తెలియజేశారు. ములాయం సింగ్ యాదవ్ ప్రస్తుతం మెదంతా ఆస్పత్రిలో ఉన్నారు. వివిధ రకాల వైద్య నిపుణుల పర్యవేక్షణలో ఆయనకు చికిత్స కొనసాగుతుంది.
Samayam Telugu Mulayam Singh Yadav


కొన్ని వారాలుగా ఆస్పత్రిలో ఉన్న ములాయం సింగ్ ఆరోగ్యం క్షీణించిడంతో ఆదివారం ఐసీయూ వార్డులోకి షిఫ్ట్ చేశారు. ఈ విషయం తెలుసుకున్న వెంటనే ములాయం సింగ్ యాదవ్ కుమారుడు, మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్‌ వెంటనే ఉత్తరప్రదేశ్ నుంచి బయలుదేరి మెదంతా ఆస్పత్రికి వెళ్లారు. తన తండ్రి ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్నారు. మరోవైపు ములాయం సింగ్ యాద‌వ్ త్వ‌ర‌గా కోలుకోవాల‌ని స‌మాజ్‌వాదీ పార్టీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు ప్రార్థనలు, పూజలు చేస్తున్నారు. కాగా ములాయం సింగ్ యాదవ్ యూపీ సీఎంగా మూడుసార్లు పనిచేశారు. భారత రక్షణ శాఖ మంత్రిగా కూడా బాధ్యతలు నిర్వర్తించారు. ఆయన గత కొన్నేళ్లుగా అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు.

Read More: National News and Telugu News

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.