యాప్నగరం

సమాజ్‌వాదీ పార్టీ సీనియర్ నేత ములాయం సింగ్ యాదవ్ కన్నుమూత

Uttar Pradesh: సమాజ్‌వాదీ పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ ములాయం సింగ్ యాదవ్ కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన యూపీలోని స్వగ్రామంలో తుది శ్వాస విడిచారు.

Samayam Telugu 5 Oct 2020, 6:53 pm
మాజ్‌వాదీ పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ ములాయం సింగ్ యాదవ్ (92) కన్నుమూశారు. దీంతో పార్టీలో విషాదం అలుముకుంది. కొంత కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన ఉత్తర్ ప్రదేశ్‌లోని ఔరారియా జిల్లాలోని తన స్వగ్రామం పూర్వాలో శనివారం (అక్టోబర్ 3) రాత్రి తుది శ్వాస విడిచారు. గత కొన్నేళ్లుగా ఆయన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఆదివారం ఉదయం ఆయన అంత్యక్రియలు నిర్వహించారు.
Samayam Telugu సమాజ్‌వాదీ పార్టీ
MLC Mulayam Singh Yadav death


సమాజ్‌వాదీ పార్టీ అధినేత, యూపీ మాజీ సీఎం ములాయం సింగ్ యాదవ్‌ది, ఎమ్మెల్సీ ములాయంది ఒకటే పేరు కావడం యాదృశ్చికం. పార్టీ అధినేతతో ఆయనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. మూడుసార్లు ఎమ్మెల్సీగా సేవలు అందించడమే కాకుండా.. పార్టీ బలోపేతానికి విశేషంగా కృషి చేశారు.

ఎమ్మెల్సీ ములాయం సింగ్ యాదవ్ మృతి పట్ల సమాజ్‌వాదీ పార్టీ ప్రస్తుత అధ్యక్షుడు, మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పార్టీకి ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. ములాయం సింగ్ యాదవ్ ఇటీవలే కాన్పూర్ హాస్పిటల్‌లో చికిత్స తీసుకొని డిశ్చార్జ్ అయ్యారు.

Also Read: మాస్క్ లేదని కానిస్టేబుల్‌నే చితక్కొట్టారు.. రాజధానిలో దారుణం

విద్యార్థి దశ నుంచే రాజకీయాల పట్ల ఆకర్షితులైన ములాయం 1949లో తన 21వ ఏట సర్పంచ్‌గా ఎన్నికయ్యారు. ఆ తర్వాత పదేళ్ల పాటు బ్లాక్ ప్రెసిడెంట్‌గా ఎన్నికయ్యారు. 1990లో తొలిసారిగా యూపీ శాసనమండలికి ఎన్నికయ్యారు. సమాజ్‌వాదీ పార్టీ తరఫున 15 ఏళ్ల పాటు శాసనమండలి సభ్యుడిగా సేవలు అందించారు. ములాయం మృతి పట్ల పార్టీ నేతలు సంతాపం తెలిపారు.

Must Read: వాసన గుర్తించలేకపోతున్నారా.. అయితే కచ్చితంగా కరోనానే!

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.