యాప్నగరం

కరోనా రోగం కాదు.. దేవుడి శిక్ష, ఎలా పోతుందంటే: ఎంపీ సంచలన వ్యాఖ్యలు

ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న కరోనా మహమ్మారి వాస్తవానికి రోగం కాదట. అది దేవుడు విధించిన శిక్ష అట. మధ్యప్రదేశ్‌లోని సంబల్‌కు చెందిన సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ రెహ్మాన్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఎలా పోతుందో కూడా చెప్పారు.

Samayam Telugu 22 Jul 2020, 1:06 am
రోనా మహమ్మారి రోగం కాదట. మనం చేసిన పాపాలకు దేవుడు విధించిన శిక్షేనట. మధ్యప్రదేశ్‌లోని సంబల్‌కు చెందిన సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ షఫికుర్ రెహ్మాన్ బార్క్ ఇలా చెప్తున్నారు. అందుకే కరోనా వైరస్‌కు ఇప్పటి వరకు ఎలాంటి చికిత్సా విధానాన్ని కనిపెట్టలేకపోయారని ఆయన వ్యాఖ్యానించారు. మనమంతా దేవుడ్ని ప్రార్థిస్తేనే కరోనా అంతమవుతుందని రెహ్మాన్ పేర్కొన్నారు.
Samayam Telugu కరోనా వైరస్
MP MP statement on Corona


అంతేకాదు ప్రార్థనల కోసం మసీదులు, ఈద్గాలను తెరవాలని రెహ్మాన్ కోరారు. బక్రీద్‌ను పురస్కరించుకుని మసీదులలో ప్రత్యేక ప్రార్థనల కోసం అనుమతించాలని కోరారు. దీంతో పాటు మేకలు, గొర్రెలు అమ్మే మార్కెట్లను అందుబాటులో ఉంచాలని ఆయన సూచించారు.

Must Read: ఆరోగ్య ఆహారం వైపు దేశం చూపు.. సర్వేలో ఆసక్తికర వివరాలు

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.