యాప్నగరం

ఈడీ నూతన చీఫ్‌గా సంజయ్ కుమార్ మిశ్రా

ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ నూతన చీఫ్‌గా 1984 బ్యాచ్‌కు చెందిన ఐఆర్ఎస్ అధికారి సంజయ్ కుమార్ మిశ్రా నియమితులయ్యారు.

Samayam Telugu 27 Oct 2018, 2:08 pm
Samayam Telugu ed chief.
ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ నూతన చీఫ్‌గా ఐఆర్ఎస్ అధికారి సంజయ్ కుమార్ మిశ్రా నియమితులయ్యారు. 1984 బ్యాచ్ ఇండియన్ రెవెన్యూ సర్వీస్‌కు చెందిన మిశ్రాకు ఈడీ ప్రిన్సిపల్ స్పెషల్ డైరెక్టర్‌గా బాధ్యతలు అప్పగిస్తూ కేబినెట్ నియామకాల కమిటీ శనివారం ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుత డైరెక్టర్ కర్నల్ సింగ్ పదవీకాలం శనివారంతో ముగియడంతో ఆ స్థానాన్ని కూడా మిశ్రా భర్తీ చేస్తారు. మూడు నెలలపాటు ఆపద్ధర్మ ఈడీ డైరెక్టర్‌గా ఆయన పని చేయనున్నారు.

1984 యూటీ కేడర్‌కు చెందిన సింగ్ ఈడీ డైరెక్టర్‌గా మూడేళ్ల పదవీ కాలం పూర్తి చేసుకున్నారు. మిశ్రా ప్రస్తుతం ఆదాయ పన్ను విభాగంలో చీఫ్ కమిషనర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఈడీలో ప్రిన్సిపల్ స్పెషల్ డైరెక్టర్‌ పదవిని ఇటీవలే సృష్టించారు. ఈ పదవికి ఎంపికైన తొలి వ్యక్తి సీమాంచల్ దాస్ కాగా.. రెండో అధికారి మిశ్రా కావడం గమనార్హం. దేశంలో నల్లధనాన్ని వెలికితీయడం, మనీలాండరింగ్‌ను అరికట్టడంలో ఈడీ కీలకంగా వ్యవహరిస్తుంది.

ప్రధాని మోదీ ప్రిన్సిపల్ సెక్రటరీ నృపేంద్ర మిశ్రాకు సంజయ్ కుమార్ మిశ్రా సన్నిహితుడు. నేషనల్ హెరాల్డ్, మాయావతి కేసులను విచారించడం ద్వారా ఆయన వార్తల్లో నిలిచారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.