యాప్నగరం

భన్సాలీపై దాడి ఘటనపై విచారణకు ఆదేశం

ప్రముఖ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీపై కొందరు ఆందోళన కారులు దాడి చేసిన సంగతి తెలసిందే.

TNN 28 Jan 2017, 1:28 pm
ప్రముఖ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీపై కొందరు ఆందోళన కారులు దాడి చేసిన సంగతి తెలసిందే. శుక్రవారం రాజస్టాన్ లోని జైపూర్ లో ఉన్న ఓ కోటలో ‘పద్మావతి’ సినమా షూటింగ్ ఆయన ఉన్నప్పుడు ఈ ఘటన జరిగింది. రాణి పద్మావతిని అగౌరవపరిచేలా సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారంటూ రాజ్ పుట్ కర్ణి సేన సభ్యులు భన్సాలీపై చేయిచేసుకున్నారు. సెట్‌ను నాశనం చేశారు. షూటింగ్ సామగ్రిని ధ్వంసం చేశారు. కాగా భన్సాలీపై జరిగిన దాడిపై ఆ రాజస్థాన్ రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. ఆయనపై జరిగిన దాడిని ఖండించింది. దాడిపై దర్యాప్తునకు ఆదేశిస్తున్నట్టు రాజస్థాన్ హోం శాఖా మంత్రి జీసీ కటారియా శనివారం తెలిపారు. నిరసన తెలిపే అధికారం ప్రతి పౌరునికి ఉంటుందని అయితే వ్యక్తిగత దాడులు చేయడం మాత్రం ఉపేక్షించేది కాదని అన్నారు. విచారణ ఇప్పటికే ప్రారంభమైనట్టు చెప్పారు.
Samayam Telugu sanjay leela bhansali assaulted rajasthan home minister gc kataria orders probe
భన్సాలీపై దాడి ఘటనపై విచారణకు ఆదేశం


దీపకి పదుకునే ప్రధాన పాత్రలో ‘పద్మావతి’ సినిమాను తెరకెక్కిస్తున్నారు సంజయ్ లీలా భన్సాలీ. చిత్తోర్ ఘడ్ రాణి అయిన పద్మావతి అందానికి ముగ్ధుడైన సుల్తాన్ అల్లావుద్దీన్ ఖిల్జీ పాత్రలో రణ్ వీర్ సింగ్ నటిస్తున్నాడు. వీరిద్దరి మధ్య ప్రేమ సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారని ఆందోళనకారుల ఆరోపణ. పద్మావతి క్యారెక్టర్ ను తగ్గించేలా సంజయ్ నిర్మిస్తున్నాడని అతనిపై రాజ్ పుట్ కర్ణి సేన సభ్యులు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.