యాప్నగరం

తెరపైకి జయ మేనల్లుడు దీపక్...?

తనను దోషిగా ప్రకటిస్తూ సుప్రీంకోర్టు తీర్పు వెలువరించిన వార్త విన్న అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి వీకే శశికళ ఒక్కసారిగా కంటతడి పెట్టుకున్నారు

Samayam Telugu 14 Feb 2017, 12:12 pm
తనను దోషిగా ప్రకటిస్తూ సుప్రీంకోర్టు తీర్పు వెలువరించిన వార్త విన్న అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి వీకే శశికళ ఒక్కసారిగా కంటతడి పెట్టుకున్నారు. సోమవారం రాత్రి నుంచి ఎమ్మెల్యేలున్న గోల్డెన్ బే రిసార్టులోనే ఉన్న శశికళ..ఇప్పుడు తాను జైలుకు వెళ్లాక తదుపరి అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి బాధ్యతలు, శాసనసభా పక్ష నేతగా ఎవరిని ఎన్నుకోవాలనే అంశంపై ఆమె ఎమ్మెల్యేలతో చర్చలు జరుపుతున్నారు.
Samayam Telugu sasikala break downs as she was convicted by supreme court
తెరపైకి జయ మేనల్లుడు దీపక్...?


అక్రమాస్తులు కేసులో దోషిగా తేలిన శశికళ వెంటనే లొంగిపోవాలని సుప్రీంకోర్టు ఆదేశించిన నేపథ్యలో..ఆమె ఉన్న రిసార్టును వేలాదిమంది పోలీసులు చుట్టు ముట్టారు. దీంతో ఆమెను రిసార్టు నుంచే కర్నాటకలోని జైలుకు వెళ్లే అవకాశాలున్నాయి. దీంతో ఆమె తన ‘వారుసుణ్ని’ ఎంపిక చేసి వెళ్లాలని భావిస్తున్నారు.

అయితే శశికళ జైలుకు వెళ్లాక ఆమె శిబిరంలో ఎంత మంది ఉంటారు? ఎంత మంది ఓపీఎస్ జై కొడతారనే దానిపై అనుమానాలున్నాయి. దీంతో తొలినుంచి ఆమెకు అండగా ఉన్న తంబిదురై, సెంగొట్టయ్యన్ లలో ఒకరికి పార్టీ బాధ్యతలు, మరొకరు శాసనసభాపక్ష నేతగా ఎన్నుకోవాలని ఎమ్మెల్యేలను దిశానిర్దేశం చేయనున్నట్లు సమాచారం.

మరోవైపు ప్రస్తుత పరిస్థులను చేయిదాటిపోకుండా ఉండేందుకు దివంగత సీఎం జయలలిత మేనల్లుడు దీపక్ ను తెరపైకి తీసుకొచ్చేందుకు కూడా ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. దీపక్ ను శాసనపక్ష నేతగా ఎన్నుకోవాలని అలా చేస్తే... అందరి మద్దతు మనకే ఉంటుందని, పార్టీ మనుగడ ఉంటుందని చిన్నమ్మ వ్యూహరచన చేస్తున్నట్లు తెలిసింది.

దీపక్ అయితేనే తాను చెప్పినట్లు వింటాడని ఆమె భావిస్తున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.