యాప్నగరం

జైల్లో శశికళ వ్రతం..ఆమె కోరిక అదే!

ప్రస్తుతం బెంగళూరు పరిధిలోని పరప్పన అగ్రహార జైల్లో శిక్షను అనుభవిస్తున్న తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత సన్నిహితురాలు శశికళ

TNN 30 Dec 2017, 10:13 am
ప్రస్తుతం బెంగళూరు పరిధిలోని పరప్పన అగ్రహార జైల్లో శిక్షను అనుభవిస్తున్న తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత సన్నిహితురాలు శశికళ జైల్లో ఒక వ్రతం చేస్తోందట. జైల్లో ఉంటూ వ్రతాలూ, పూజలూ చేసుకోవచ్చా? అనే అనుమానం ఎవరికైనా రావొచ్చు. శశి చేస్తున్నవ్రతానికి మాత్రం బహుశా ఎవరి పర్మిషన్ అక్కర్లేదేమో. ఎందుకంటే.. ఆమె చేస్తున్నది మౌనవ్రతం కాబట్టి.
Samayam Telugu sasikala follows mounavratham in jail
జైల్లో శశికళ వ్రతం..ఆమె కోరిక అదే!


ఎవ్వరితోనూ మాట్లాడకుండా.. శశికళ ఈ వ్రతం ఆచరిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఎంత కఠినంగా అంటే.. ఇటీవల ఆర్కే నగర్ బై పోల్ లో విజయం సాధించి జైలుకు వెళ్లిని ఆమెతో సమావేశం అయిన దినకరన్ తో కూడా శశి మాట్లాడలేదట. విజయానందాన్ని దినకరన్ పంచుకోగా.. శశి కేవలం చిరునవ్వులతోనే బదులిచ్చారట.

ఇంతకీ ఉన్నఫలంగా శశి ఈ వ్రతం ఎందుకు చేస్తోంది? అంటే.. దీని వెనుక పెద్ద లక్ష్యమే ఉందట. తమిళనాడులో ఈపీఎస్ ప్రభుత్వం పడిపోవాలనే కోరికతో శశి మౌనవ్రతాన్ని ఆచరిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇంకా చెప్పాలంటే.. ఈపీఎస్ ప్రభుత్వం పడిపోయేంత వరకూ మౌనవ్రతాన్ని ఆపకూడదని నిర్ణయించుకుందట శశికళ. గట్టి కోరికతోనే ఆమె ఈ వ్రతాన్ని ఆచరిస్తున్నట్టుగా ఉంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.