తమిళనాడులోని అన్నాడీఎంకే ప్రభుత్వాన్ని కూల్చేందుకు భారతీయ జనతా పార్టీ ప్రయత్నిస్తోందని చిన్నమ్మ భర్త నటరాజన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ రాష్ట్రాన్ని కాషాయీకరణ చేసేందుకు భాజపా కుట్ర పన్నుతోందని ఆయన ఆరోపించారు. అయితే బీజేపీ కుట్రలను తిప్పికొడతామని నటరాజన్ అన్నారు. తాము కుటుంబ రాజకీయాలే చేస్తున్నామని ఆయన బాహటంగానే ప్రకటించారు . ఇందులో ఎలాంటి దాపరికం లేదని పేర్కొన్నారు.
ఎంజీఆర్ మరణం తర్వాత జయలలితను తామే కాపాడామని తెలిపారు. తమిళనాడు ముఖ్యమంత్రిగా పన్నీర్ సెల్వం సమర్థంగానే బాధ్యతలు నిర్వహిస్తున్నారని, ఇప్పట్లో ఆయన్ను మార్చే ప్రసక్తే లేదని అన్నారు. శశికళ సీఎం పీఠం అధిరోహించాలా? వద్దా? అనేది ఎంఎల్ఏల నిర్ణయంపై ఆధారపడి ఉంటుందన్నారు. ప్రభుత్వాన్ని కూల్చేందుకు ప్రయత్నిస్తోన్న వ్యతిరేక శక్తుల కుట్రలను కలిసికట్టుగా ఎదుర్కోవాలని అన్నాడీఎంకే నాయకులకు, కార్యకర్తలకు నటరాజన్ పిలుపునిచ్చారు.
ఎంజీఆర్ మరణం తర్వాత జయలలితను తామే కాపాడామని తెలిపారు. తమిళనాడు ముఖ్యమంత్రిగా పన్నీర్ సెల్వం సమర్థంగానే బాధ్యతలు నిర్వహిస్తున్నారని, ఇప్పట్లో ఆయన్ను మార్చే ప్రసక్తే లేదని అన్నారు. శశికళ సీఎం పీఠం అధిరోహించాలా? వద్దా? అనేది ఎంఎల్ఏల నిర్ణయంపై ఆధారపడి ఉంటుందన్నారు. ప్రభుత్వాన్ని కూల్చేందుకు ప్రయత్నిస్తోన్న వ్యతిరేక శక్తుల కుట్రలను కలిసికట్టుగా ఎదుర్కోవాలని అన్నాడీఎంకే నాయకులకు, కార్యకర్తలకు నటరాజన్ పిలుపునిచ్చారు.