యాప్నగరం

పోయెస్ గార్డెన్‌ను మెమోరియల్‌గా మారుస్తాం

తమిళనాడు ముఖ్యమంత్రి అయ్యేందుకు అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి వీకే శశికళ నీచ పన్నాగాల (ట్రిక్స్)కు

Samayam Telugu 9 Feb 2017, 2:41 pm
తమిళనాడు ముఖ్యమంత్రి అయ్యేందుకు అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి వీకే శశికళ నీచ పన్నాగాల (ట్రిక్స్)కు పాల్పడుతున్నారని అపద్ధర్మ సీఎం ఓ పన్నీర్ సెల్వం మండిపడ్డారు. దివంగత సీఎం జయలలిత నివాసం పోయెస్ గార్డెన్ ను మెమోరియల్ (స్మారకం)గా మారుస్తామని ఆయన వెల్లడించారు.
Samayam Telugu sasikala playing dirty tricks to become cm says ops
పోయెస్ గార్డెన్‌ను మెమోరియల్‌గా మారుస్తాం


జయ అండ్ టీం తనపై చేసే ఆరోపణలన్నింటికీ సమాధానం చెబుతానని ఆయన అన్నారు. జయలలిత అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో శశికళ అమ్మను కలవనీయలేదని ఆరోపించారు.

ప్రెసిడియం చైర్మన్ ఇ. మధుసూదనన్ ఓ పన్నీరు సెల్వంను కలిసి మద్దతు ప్రకటించడం శశికళ టీం కు పెద్ద షాక్ ఇచ్చినట్లైంది.

‘‘అమ్మ అపోలో చికిత్స పొందుతున్న 24రోజుల తర్వాత కోలుకుంటున్నారని శశికళ చెప్పారు. అదే ఆమె నాతో మొదటిసారిగా మాట్లాడటం’’ అని ఓపీఎస్ పేర్కొన్నారు.

‘‘సీఎం అయ్యేందుకు శశికళ నీచ పన్నాగం పన్నుతున్నారు. ఆమె సీఎం అయితే ప్రజాస్వామ్యానికే ఓ మచ్చ’’ అని ఆయన హెచ్చరించారు.

అమ్మను ఏనాడు మోసం చేయలేదని శశికళ చెప్పుకోవడం శుద్ధ అబద్ధం అని ఓపీఎస్ మండిపడ్డారు.

కాగా, తమిళనాడు ఇన్ చార్జి గవర్నర్ సిహెచ్ విద్యాసాగర్ రావు చెన్నై బయలుదేరారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.