యాప్నగరం

శశికళ రాజభోగం.. రూపపై పరువునష్టం దావా!

జైళ్లో శశికళ రాజభోగాలను బయటపెట్టిన డీఐజీ రూపపై ఎదురు దాడి కొనసాగుతూనే ఉంది. ఆమె కర్ణాటక డీజీపీ పరువు నష్టం దావా వేశారు.

TNN 27 Jul 2017, 12:03 pm
జైళ్లో శశికళ రాజభోగాలను బయటపెట్టిన డీఐజీ రూపపై ఎదురు దాడి కొనసాగుతూనే ఉంది. తాజాగా కర్ణాటక డీజీపీ హెచ్‌ఎన్ సత్యనారాయణ రావు ఆమెకు లీగల్ నోటీసులు జారీ చేశారు. శశికళ వ్యవహారంలో తప్పు చేశానని పత్రికల సాక్షిగా ఒప్పుకోవాలని ఆయన రూపకు సూచించారు. లేదంటే చట్టపరంగా చర్యలు తీసుకోవాల్సి వస్తుందని, పరువు నష్టం కింద.. రూ. 50 కోట్లు చెల్లించాల్సి ఉంటుందని ఆ నోటీస్‌లో ఆయన పేర్కొన్నారు.
Samayam Telugu sasikala prison bribe issue dig d roopa slapped with rs 50 crore defamation suit
శశికళ రాజభోగం.. రూపపై పరువునష్టం దావా!


శశికళకు జైళ్లో ప్రత్యేక సదుపాయాలు కల్పిస్తున్నారని, ఇందుకోసం రూ. 2 కోట్ల మేర లంచాలు ముట్టాయని రూప ఆరోపించారు. ఇందులో డీజీపీ రావుకు కూడా ప్రమేయం ఉందని రూప తెలిపారు. ఈ విషయంలో కర్ణాటక సీఎం సిద్ధరామయ్య కూడా ఆమెను తీవ్రంగా మందలించారు. తదనంతరం కర్ణాటక ప్రభుత్వం ఆమెను జైళ్ల శాఖ నుంచి బదిలీ చేసింది. అయినప్పటికీ ఈ వివాదం మాత్రం సద్దుమణగలేదు. రూప ఆరోపణల పట్ల డీజీపీ స్పందిస్తూ.. తాను చాలా ఇబ్బంది పడ్డానని, తన పేరు ప్రఖ్యాతులు దెబ్బతిన్నాయన్నారు.

జైళ్లో శశికళ కోసం ప్రత్యేకంగా కిచెన్, ఇతర వీఐపీ సదుపాయాలు కల్పిస్తున్నారని చెప్పిన రూప.. వాటికి సంబంధించి ఫొటోలను ఎందుకు తీయలేకపోయారని ప్రశ్నించారు. ఆమె చెప్పేవన్నీ అబద్ధాలని, అందుకే ఆమె దగ్గర అందుకు సంబంధించిన ఫొటోలు లేవని రావు తెలిపారు. రూ. 2 కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చాయి. వాటిని తెచ్చిందెవరు, ఎక్కడ ఉంచారు.. తదితర విషయాలను నిగ్గు తేల్చడానికి ఆదాయ పన్ను విభాగ అధికారులను సంప్రదిస్తానని ఆయన తెలిపారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.