యాప్నగరం

ఏం చేస్తామో జస్ట్ వెయిట్ అండ్ సీ: శశికళ

ఆదివారం సాయంత్రం కువతూర్‌లోని గోల్డెన్ బే రిసార్ట్స్‌లో వున్న ఏఐఏడీఎంకే ఎమ్మెల్యేలతో భేటీ అయిన అనంతరం

TNN 12 Feb 2017, 8:30 pm
ఆదివారం సాయంత్రం కువతూర్‌లోని గోల్డెన్ బే రిసార్ట్స్‌లో వున్న ఏఐఏడీఎంకే ఎమ్మెల్యేలతో భేటీ అయిన అనంతరం ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి శశికళ ఎమ్మెల్యేలతో కలిసి మీడియా ముందుకొచ్చారు. తాను ఎమ్మెల్యేలని రిసార్ట్స్‌లో బంధించి బెదిరింపులకి పాల్పడుతున్నానని వస్తున్న ఆరోపణలను ఖండించిన శశికళ.. తామంతా ఓ కుటుంబంలా కలిసిమెలిసే వున్నామని అన్నారు. తన ప్రత్యర్థి సహాయం పొందుతున్న కొంతమంది, వాళ్లు చెప్పే మాటలు విని తనపై లేనిపోని అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని ఈ సందర్భంగా శశికళ ఆవేదన వ్యక్తంచేశారు.
Samayam Telugu sasikala talks to media after meeting mlas
ఏం చేస్తామో జస్ట్ వెయిట్ అండ్ సీ: శశికళ

You can see truth that non of our MLAs have been forcibly kept here, we are living here as a family: #VKSasikala pic.twitter.com/XaEiwEpBWV— ANI (@ANI_news) February 12, 2017
మాపై బురదజల్లి, మమ్మల్ని అప్రతిష్టపాలుచేసేందుకు శతవిధాల ప్రయత్నిస్తున్నారు. నాకు మద్దతిస్తున్న కారణంగా నాతో వున్న ఎమ్మెల్యేల పిల్లలు, కుటుంబసభ్యులు వాళ్ల వాళ్ల బంధువుల ఇళ్లలో తలదాచుకునే పరిస్థితి దాపురించింది అని ఆరోపించారు శశికళ. తర్వాత తాము ఏం చేయాలనుకుంటున్నామో మీరే వేచిచూడండి అని శశికళ చెప్పినట్టుగా ఏఎన్ఐ పేర్కొంది. రిసార్ట్స్‌లో ఎమ్మెల్యేలతో శశికళ సమావేశం నేపథ్యంలో రిసార్ట్స్ వెలుపల భారీ బందోబస్తు కనిపించింది. ఏ క్షణం, ఏమైనా జరిగే అవకాశం వుందన్న ఆందోళనల నేపథ్యంలో రిసార్ట్స్ వద్ద భారీ ఎత్తున భద్రతాబలగాలు పహారా కాస్తూ కనిపించాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.