యాప్నగరం

జయ సమాధి వద్ద చిన్నమ్మ కన్నీటిపర్యంతం

అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత సమాధి వద్ద కన్నీటి పర్యంతమయ్యారు.

TNN 9 Feb 2017, 7:29 pm
అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత సమాధి వద్ద కన్నీటి పర్యంతమయ్యారు. గవర్నర్ విద్యాసాగర్‌రావుతో సమావేశమయ్యేందుకు గురువారం రాత్రి రాజ్‌భవన్‌కు బయలుదేరిన శశికళ మొదట మెరీనా బీచ్‌లో ఉన్న జయ సమాధి వద్దకు చేరుకున్నారు. ఎమ్మెల్యేలతో కలసి జయ సమాధి వద్ద నివాళుర్పించిన శశికళ, ఎమ్మెల్యేలు తనకు మద్దతుతెలిపిన లేఖను సమాధిపై ఉంచారు. ఈ సమయంలో భావోద్వేగానికి గురైన శశికళ కన్నీటిపర్యంతమయ్యారు. అనంతరం రాజ్‌భవన్‌కు చేరుకున్నారు.
Samayam Telugu sasikala visited jayalalithaas memorial at chennais marina beach
జయ సమాధి వద్ద చిన్నమ్మ కన్నీటిపర్యంతం


7.30 గంటలకు గవర్నర్‌తో సమావేశం అవుతున్న శశికళ ఎమ్మెల్యేల మద్దతు లేఖను ఆయనకు అందజేయనున్నారు. మెజారిటీ ఎమ్మెల్యేల మద్దతు తనకే ఉందని, కాబట్టి తనను వెంటనే ముఖ్యమంత్రిని చేయాలని శశికళ గవర్నర్‌ను కోరనున్నారు. తనకు 130 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉన్నట్లు ఇప్పటికే శశికళ ప్రకటించిన సంగతి తెలిసిందే.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.