యాప్నగరం

అవి బయటికొస్తే ఆత్మహత్య చేసుకుంటా?!

తమిళనాడు దివంగత సీఎం జయలలిత మృతిపై విచారణ జరిపితే తాను ఆత్మహత్య చేసుకుంటానని చిన్నమ్మ శశికళ

Samayam Telugu 23 Apr 2017, 1:41 pm
తమిళనాడు దివంగత సీఎం జయలలిత మృతిపై విచారణ జరిపితే తాను ఆత్మహత్య చేసుకుంటానని చిన్నమ్మ శశికళ హెచ్చరించినట్లు మీడియాలో కథనాలు వస్తున్నాయి. జయ మరణించక ముందు 75 రోజులపాటు అపొలో ఆసుపత్రిలో చికిత్స పొందారు. ఈ సమయంలో ఆమె వెంట శశికళ మాత్రమే ఉన్నారు.
Samayam Telugu sasikala warns to commit suicide if probe orders on jayas death
అవి బయటికొస్తే ఆత్మహత్య చేసుకుంటా?!


జయ మృతిపై అనుమానాలున్నాయని.. ఆమె చికిత్స పొందుతున్న 75రోజుల్లో ఏ ఒక్క రోజు ఫొటోలు, వీడియోలు విడుదల చేయలేదని మాజీ సీఎం ఓ పన్నీరుసెల్వం అనుమానం వ్యక్తం చేస్తున్నారు. జయలలిత మృతిపై సీబీఐ చేత విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. జయ చికిత్స పొందిన సమయంలో వీడియోలు విడుదల చేయాలని కోరుతున్నారు.

అయితే జయలలిత మృతి విచారణ జరిపితే మాత్రం తాను ఆత్మహత్యకు పాల్పడతానని తనకు చెప్పినట్లు చిన్నమ్మ సమీప బంధువు జయానంద్ దివాకరన్ వెల్లడించినట్లు మీడియాలో కథనాలు వస్తున్నాయి. దీంతో జయ మరణంపై మరిన్ని అనుమానాలు బలపడుతున్నాయి.

జయ చివరి రోజుల్లో అనుభవించిన బాధలు, ప్రపంచానికి తెలియకూడదనే శశికళ ఆ వీడియోలు రిలీజ్ చేయవద్దని కోరుతున్నట్లు దివాకరన్ అంటున్నారు.

జయ మరణానికి శశికళతో ఆమె కుటుంబ సభ్యులే కారణమి ఓపీఎస్ వర్గం ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.