ఆర్కేనగర్ కు వచ్చే నెల ఉప ఎన్నిక జరుగుతున్న సంగతి తెలిసిందే. కాగా అధికార అన్నాడీఎంకే తమ పార్టీ అభ్యర్థిని ప్రకటించింది. శశికళ మేనల్లుడైన దినకరన్ ఆర్కేనగర్ నుంచి అన్నాడీఎంకే పార్టీ తరుపున పోటీ చేయబోతున్నారు. శశికళ జైలుకు వెళ్లకుండా ఉంటే... ఆమె పోటీ చేయాల్సింది. దినకరన్ ప్రస్తుతం అన్నాడీఎంకే ఉప ప్రధాన కార్యకర్శిగా పనిచేస్తున్నారు. ఏప్రిల్ 12న ఆర్కేనగర్ ఉపఎన్నిక పోలింగ్ జరగనుంది. ఏప్రిల్ 15న ఫలితం విడుదలవుతుంది. పన్నీరు సెల్వం వర్గం నుంచి ఎవరు పోటీలో నిలబడతారో ఇంకా ప్రకటించలేదు. ఆ వర్గం కూడా నేటి రాత్రిలోపు ప్రకటించే అవకాశం ఉంది. ఎందుకంటే నామినేషన్ల పర్వం రేపట్నించే ప్రారంభమవుతుంది. ఇక జయలలిత మేనకోడలు దీప తానే ఆర్కేనగర్ నుంచి బరిలో దిగబోతున్నట్టు ప్రకటించింది. డీఎంకే పార్టీ కూడా తమ అభ్యర్థిని ఇంకా ప్రకటించాల్సి ఉంది.
ఆర్కే నగర్ నుంచి చిన్నమ్మ మేనల్లుడు పోటీ
ఆర్కేనగర్ కు వచ్చే నెల ఉప ఎన్నిక జరుగుతున్న సంగతి తెలిసిందే.
TNN 15 Mar 2017, 3:04 pm