యాప్నగరం

పాత నోట్లపై కేంద్రాన్ని నిలదీసిన సుప్రీంకోర్టు

రద్దయిన రూ.1000, రూ.500 పాతనోట్ల మార్పిడికి విధించిన గడువు తగ్గించడంపై సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వం, ఆర్బీఐలపై మండిపడింది.

TNN 6 Mar 2017, 1:59 pm
రద్దయిన రూ.1000, రూ.500 పాతనోట్ల మార్పిడికి విధించిన గడువు తగ్గించడంపై సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వం, ఆర్బీఐలపై మండిపడింది.
Samayam Telugu sc asks centre why you went back on promise to extend cut off date to deposit old notes
పాత నోట్లపై కేంద్రాన్ని నిలదీసిన సుప్రీంకోర్టు


నవంబర్ 9 అర్థరాత్రి నుంచి మార్చి 31 వరకు రద్దయిన పాతనోట్లను ఆర్బీఐ శాఖల్లో మార్చుకునేందుకు తొలుత కేంద్ర ప్రభుత్వం అవకాశం కల్పించింది. కానీ డిసెంబర్ 31 తర్వాత పాత నోట్లు కల్గి ఉన్నవారు వివిధ ధృవపత్రాలతో వివిధ రాష్ట్రాల్లో ఉన్న ఆర్బీఐ శాఖల చుట్టు తిరిగినా ఫలితం లేకుండా పోయింది. ‘పాతనోట్లు తీసుకొనబడవు’ అంటూ బోర్డులు పెట్టాయి.

దీంతో వివిధ సంస్థలు, వ్యక్తులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్లపై సోమవారం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేఎస్ ఖెహర్, డీవై చంద్రచుద్, కెఎస్ కౌల్ ల ధర్మాసనం విచారణ చేపట్టింది.

డిసెంబర్ 31 తర్వాత ఆర్బీఐ శాఖల్లో ఎక్కడ పాతనోట్ల మార్పిడి స్వీకరించడం లేదని పిటిషనర్లు కోర్టు దృష్టికి తీసుకొచ్చారు.

దీంతో సుప్రీంకోర్టు కేంద్రప్రభుత్వంతో పాటు ఆర్బీఐలు వివరణ ఇవ్వాలని ఆదేశించింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.