యాప్నగరం

కావేరీ జలాలపై రేపటిలోగా నివేదికివ్వండి

కావేరీ జలాలను తమిళనాడుకు విడుదల చేయాలని తాను జారీ చేసిన ఆదేశాలపై రేపు (మంగవారం) నివేదికను సమర్పించాలని కర్ణాటక ప్రభుత్వాన్ని సుప్రీం కోర్టు ఆదేశించింది.

TNN 3 Oct 2016, 2:39 pm
కావేరీ జలాలను తమిళనాడుకు విడుదల చేయాలని తాను జారీ చేసిన ఆదేశాలపై రేపు (మంగవారం) నివేదికను సమర్పించాలని కర్ణాటక ప్రభుత్వాన్ని సుప్రీం కోర్టు ఆదేశించింది. తమిళనాడుకు రోజుకు 6వేల క్యూసెక్కుల చొప్పున నీటిని విడుదల చేయాలని సుప్రీంకోర్టు కర్ణాటకను ఆదేశించినప్పటికీ...రెండు సార్లు..ఆ తీర్పును సిద్ధరామయ్య ప్రభుత్వం పక్కన బెట్టిన సంగతి తెలిసిందే. తమిళనాడుకు నీరందిస్తే తమకు తాగడానికి కూడా చుక్క నీరుండదని వాదిస్తున్న కర్ణాటక, ఈ మేరకు నీళ్లు బయటి రాష్ట్రాలకు ఇచ్చేది లేదని తీర్మానం చేసింది.
Samayam Telugu sc asks report on cauvery water release
కావేరీ జలాలపై రేపటిలోగా నివేదికివ్వండి

కావేరీ వాటర్ మేనేజ్ మెంట్ బోర్డు ఏర్పాటు చేసి ఇరురాష్ట్రాల మధ్య నెలకొన్న జలవివాదాన్ని పరిష్కారించాలని సుప్రీంకోర్టు కేంద్రాన్ని ఆదేశించిన నేపథ్యంలో..కేంద్రప్రభుత్వం తరపున అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీ సుప్రీంను ఆశ్రయించారు.
ఇరురాష్ట్రాల మధ్య నెలకొన్ని వివాదం పరిష్కరించడం కోసం ఇప్పుడున్న పరిస్థితుల్లో కావేరి వాటర్ మేనేజ్ మెంట్ బోర్డు పనిచేయడం వీలుకాదని రోహత్గీ కోర్టుకు విన్నవించారు.
కావేరీ జలాలపై సుప్రీం నియమించిన ఇద్దరు న్యాయమూర్తులు జస్టీస్ దీపక్ మిశ్రా, సి.నాగప్పన్ ల ధర్మాసనం సెప్టెంబర్ 30న జారీ చేసిన ఆదేశాలను ఏమేరకు అమలు చేశారనే వివరాలు తెలియజేస్తూ మంగళవారం మధ్యాహ్నాంలోపు తమకు నివేదిక సమర్పించాలని కర్ణాటకను ఆదేశించారు.
సుప్రీంకోర్టు ఆదేశాలను అమలుచేయకపోతే తీవ్రపరిణామాలుంటాయని హెచ్చరించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.