యాప్నగరం

నిర్భయ కేసు: పవన్ గుప్తా పిటిషన్ కొట్టివేసిన సుప్రీం

నిర్భయ హత్యాచారం కేసు దోషుల్లో ఒకరైన పవన్ గుప్తా దాఖలు చేసిన క్యూరేటివ్ పిటిషన్‌ను సుప్రీం కోర్టు కొట్టివేసింది. ట్రయల్ కోర్టు ఆదేశాల ప్రకారం శుక్రవారం ఉదయం 5.30 గంటలకు నలుగురు దోషుల్ని ఉరి తీయాల్సి ఉంది.

Samayam Telugu 19 Mar 2020, 2:59 pm
సుప్రీం కోర్టులో నిర్భయ దోషి పవన్ గుప్తాకు మరోసారి చుక్కెదురైంది. పవన్ దాఖలు చేసిన క్యూరేటివ్ పిటిషన్‌ను గురువారం సుప్రీం కొట్టివేసింది. నిర్భయ అత్యాచార ఘటన జరిగిన సమయంలో తాను మైనర్‌నని పవన్ వాదిస్తున్నాడు. ఈ విషయమై ఇంతకు ముందే పిటిషన్ దాఖలు చేయగా అత్యున్నత న్యాయస్థానం కొట్టి వేసింది. దీంతో గత తీర్పును ఛాలెంజ్ చేస్తూ.. పవన్ సుప్రీంలో మళ్లీ పిటిషన్ వేశాడు. పవన్ గుప్తా, అక్షయ్ దాఖలు చేసిన రెండో క్షమాభిక్ష పిటిషన్లను కూడా రాష్ట్రపతి తిరస్కరించిన సంగతి తెలిసిందే.
Samayam Telugu nirbhaya convicts


పవన్ దాఖలు చేసిన క్యూరేటివ్ పిటిషన్‌ను, సంబంధిత డాక్యుమెంట్లను పరిశీలించామని ఐదుగురు సభ్యుల ధర్మాసనం తెలిపింది. పవన్ పిటిషన్‌ను సుప్రీం కొట్టివేయగా.. ఈ విషయమై నిర్భయ తల్లి ఆశా దేవి స్పందించారు. మరణ శిక్ష అమలుకు కొద్ది సమయం ముందు దోషులు ఉద్దేశపూర్వకంగానే ఇలా పిటిషన్లు దాఖలు చేస్తున్నారని.. ఇలా కొత్త పిటిషన్లు వేయడం వారికి అలవాటైపోయిందని ఆమె ఆరోపించారు. కోర్టులకు కూడా ఈ వారి వ్యూహాలు అర్థమయ్యాయన్నారు. రేపు తమ కుమార్తెకు న్యాయం జరుగుతుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.

ఢిల్లీ ట్రయల్ కోర్టు జారీ చేసిన డెత్ వారంట్ ప్రకారం నిర్భయ దోషులను మార్చి 20న ఉదయం 5.30 గంటలకు ఉరి తీయాల్సి ఉంది. ఇప్పటి మూడుసార్లు ఉరి వాయిదా పడగా.. మరోసారి వాయిదా పడటం కోసం నిర్భయ దోషులు, వారి కుటుంబీకులు సుప్రీం, ఢిల్లీ హైకోర్టు, పాటియాలా హౌస్ కోర్టుల్లో పిటిషన్లు దాఖలు చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.